మందుబాబులకు బిగ్ షాక్.. షాపులు బంద్

ఏపీలో మందుబాబులకు, లిక్కర్ ప్రియులకు పెద్ద షాకిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని మద్యం షాపులను మూసి వేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చిందే తడవుగా రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు మద్యం షాపులను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మందుబాబులకు బిగ్ షాక్.. షాపులు బంద్
Follow us

|

Updated on: May 09, 2020 | 4:00 PM

ఏపీలో మందుబాబులకు, లిక్కర్ ప్రియులకు పెద్ద షాకిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని మద్యం షాపులను మూసి వేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చిందే తడవుగా రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు మద్యం షాపులను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఏపీలో మద్యం షాపులు మూతపడనున్నాయి.

ఏపీలో మరో 13 శాతం మద్యం షాపులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తొలగించిన 20 శాతంతో కలిపి మొత్తం 33 శాతం మద్యం దుకాణాలు తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4380 షాపులకుగాను ప్రస్తుతం అందుబాటులో 3469 షాపులున్నాయి. ఈ సంఖ్యను 2934 కు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మే నెల ఆఖరు నాటికి ఈ 13 శాతం మద్యం షాపులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుండి మార్చి నాటికి రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ 24 శాతం, బీరు అమ్మకాలు 55 శాతం తగ్గినట్టు ప్రభుత్వం అంఛనా వేస్తోంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు మరింతగా తగ్గుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ప్రబలిన తరుణంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతించడంపై విమర్శలు చెలరేగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.