మా ఇళ్లు ఎక్కడున్నాయో కూడా తెలీడం లేదు

జమ్ముకశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో దాదాపు 56గంటల పాటు సాగిన భారీ ఎన్‌కౌంటర్ ఆదివారం రాత్రి ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ఐదుగురు జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. ఎన్‌కౌంటర్ జరిగిన బాబా గండ్ గ్రామంలో ఎన్నో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. చిన్న తరహా యుద్ధాన్ని తలపించిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఎదురుకాల్పులు ముగిసిన తరువాత గ్రామంలోకి ప్రవేశించిన ప్రజలు వారి ఇళ్లను కూడా గుర్తుపట్టలేకపోయారు. మూడురోజులు బిక్కుమక్కుమంటూ పలు స్థానాల్లో తలదాచుకున్న […]

మా ఇళ్లు ఎక్కడున్నాయో కూడా తెలీడం లేదు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:19 PM

జమ్ముకశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో దాదాపు 56గంటల పాటు సాగిన భారీ ఎన్‌కౌంటర్ ఆదివారం రాత్రి ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ఐదుగురు జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. ఎన్‌కౌంటర్ జరిగిన బాబా గండ్ గ్రామంలో ఎన్నో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. చిన్న తరహా యుద్ధాన్ని తలపించిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఎదురుకాల్పులు ముగిసిన తరువాత గ్రామంలోకి ప్రవేశించిన ప్రజలు వారి ఇళ్లను కూడా గుర్తుపట్టలేకపోయారు. మూడురోజులు బిక్కుమక్కుమంటూ పలు స్థానాల్లో తలదాచుకున్న వారు ఎన్‌కౌంటర్ ముగిసిన తరువాత గ్రామాన్ని చూసుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఐఏఎఫ్ కమాండర్ వింగ్ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు తిరిగి పంపాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించుకున్న తరువాత రెండు దేశాల సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో ఉన్నపాటుగా అక్కడ యుద్ధవాతావరణం నెలకొనడంతో స్థానికులను రక్షణ ప్రాంతాలకు తరలించారు భద్రతాబలగాలు.

ఎన్‌కౌంటర్ ముగిసే వారు వారు బయటకు వచ్చేందుకు భయపడగా.. అన్ని రోజులు ఆహారం, నీరు లేకుండా బాధపడ్డామని గ్రామస్థుడు అర్షద్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. ‘‘మా ఇళ్ల నుంచి మమ్మల్ని బయటకు వెళ్లమన్నారు. ఇప్పుడు మాకు నిలువ నీడ లేకుండా పోయింది. దీన్ని యుద్ధం అనకుండా ఇంకేం అంటారు’’ అంటూ అర్షద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో గ్రామస్థుడు ఫయాజ్ షా మాట్లాడుతూ.. ‘‘ఎన్‌కౌంటర్ జరుగుతున్న సమయంలో నేను గ్రామానికి దూరంగా ఉన్నా. ఆ తరువాత వచ్చి చూస్తే నా ఇళ్లు ఎక్కడుందో కూడా గుర్తించలేకపోయా’’ అంటూ తెలిపాడు.

దీనిపై ఆ గ్రామ పన్ను కలెక్టర్ మాట్లాడుతూ.. ‘‘13ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఏడు పశువుల దొడ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇంకా చాలా మంది ఇళ్లులు దెబ్బతిన్నాయి. ఎంతోమందికి పశుపోషణే ఆధారంగా బతుకుతున్నారు. ఈ నష్టపరిహారాన్ని పూడ్చుకునేందుకు గ్రామస్థులకు కొన్ని సంవత్సరాలు పడుతుంది’’ అన్నాడు.

అయితే పుల్వామా ఉగ్రదాడి తరువాత జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో వరుసగా ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. అందులో 12మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పటికీ, 12మంది జవాన్లు, పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కశ్మీర్ లోయలో ఇంకా 55 నుంచి 60మంది ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..