Bigg Boss 4: ఆ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. మోనాల్ ఏమందంటే

మొదటి వారం సూర్య కిరణ్ బిగ్‌బాస్‌లోని ఎలిమినేట్ అవ్వగా, వైల్డ్‌ కార్డుతో సాయి కుమార్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులను

Bigg Boss 4: ఆ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. మోనాల్ ఏమందంటే
Follow us

| Edited By:

Updated on: Sep 15, 2020 | 7:50 AM

Bigg Boss 4 Telugu: మొదటి వారం సూర్య కిరణ్ బిగ్‌బాస్‌లోని ఎలిమినేట్ అవ్వగా, వైల్డ్‌ కార్డుతో సాయి కుమార్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులను సర్‌ప్రైజ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే దేవి, దివిలు అతడిని పసిగట్టి వైల్డ్ కార్డు ఎంట్రీ అని ఫిక్స్ అయ్యారు. దీంతో అతడి ఎంట్రీ సాదాసీదాగా జరిగింది. ఇక కుటుంబసభ్యులందరికీ తనను పరిచయం చేసుకున్న సాయి కుమార్ తన గేమ్‌ని స్టార్ట్ చేశారు.

ఇక ‘కాటుకెట్టిన కళ్లను చూస్తే’ సాంగ్‌తో అందరూ లేచిన కుటుంబ సభ్యులు అదిరిపోయే స్టెప్పులను వేశారు. ఇక మోనాల్‌ దగ్గరికి వెళ్లిన అభిజిత్‌.. ‘మన పరిస్థితి ఏంటి క్లారిటీ ఇవ్వు.. కమ్యునికేషన్ గ్యాప్ వల్ల చిన్నది పెద్దది అయిపోతుంది. నాతో మాట్లాడి క్లియర్ చేసుకో’ అని ఓపెన్ అయ్యాడు.

మరోవైపు అఖిల్ సిద్దార్థ్, మొనాల్ గజ్జర్‌లు వంటగదిలో ఒకర్ని ఒకరు పొగుడుకుంటూ బిజీ అయ్యారు. తన కోసం పాట పాడాలని మోనాల్‌, అఖిల్‌ని కోరగా అతడు పాటను పాడుతారు. దీంతో సిగ్గుపడిన మోనాల్ అతడికి దిష్టితీసింది. ఇక అఖిల్ కూడా సంతోషడిపోతాడు. ఇక వీరిద్దరు బిగ్‌బాస్ కెమెరాల దగ్గరికి వెళ్లగా.. అక్కడ తన తల్లికి అఖిల్‌కి పరిచయం చేసింది మోనాల్.

తమతో పాటు అభిజిత్‌ని వంట సెక్షన్‌లో వేయకపోవడంతో ఫీల్ అయి, తమతో మాట్లాడటం మానేశాడని అఖిల్‌, మోనాల్ ఇద్దరు లాస్యతో గుసగుసలాడుతారు. ఇదిలా ఉంటే మోనాల్‌ని అర్థరాత్రి పిలిచి నీతో 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పిన అభిజిత్ .. ‘నా మీద నీకు డౌట్ ఉందా..? నన్ను పూర్తిగా నమ్ముతున్నావా?’ అంటూ అడిగాడు.  దానికి మోనాల్ స్పందిస్తూ.. ‘నేను నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా. కానీ టైం లేదు’ అంటూ క్లారిటీ ఇస్తుంది. ఆ తరువాత ‘నాకు నీతో మాట్లాడాలని ఉంది.. నీతో టైం గడపాలని ఉంది’ అంటూ అభిజిత్ ఫీల్ అవుతాడు. అప్పుడు మోనాల్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అయితే సూర్య కిరణ్‌ ఎలిమినేట్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని నా ఫీలింగ్స్‌కి క్వశ్చన్ చేశావు అది నాకు నచ్చలేదు అని అభిజిత్ దగ్గర మోనాల్ ఏడ్చేంత పని చేసింది. దానికి అభిజిత్.. నువ్వు నర్మద నదివి. నీ కన్నీళ్లతో డ్యామ్ కట్టేయొచ్చు. కళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందంటూ పంచ్ వేస్తారు. ఆ మాటలకు నోరు మూసుకో అంటూ వచ్చీ రాని తెలుగులో మాట్లాడి నవ్వుతుంది మోనాల్. ఇక వీరిద్దరి ముచ్చట్లు చూసి అఖిల్‌ తెగ ఫీల్ అవుతాడు. మోనాల్‌తో కాసేపు మాట్లాడటం మానేశాడు. దీంతో మోనాల్ అతడి దగ్గరికి వెళ్లి..  నాతో ఎందుకు మాట్లాడటం లేదు. నీకు మాట్లాడాలని లేదా? నాకు క్లారిటీ ఇవ్వు.. నాతో మాట్లాడాలని లేకపోతే వెళ్లిపోతా? అంటూ ట్యాప్‌ని విప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందుకు కాస్త ఫీల్ అయిన అఖిల్, మోనాల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మధ్యలో ఎంటరైన.. అభిజిత్-మోనాల్ ఏం మాట్లాడుకున్నారో చెప్పి.. నీకు ఏమైంది.. మోనాల్‌కి ఎందుకు దూరంగా ఉంటున్నావ్ అడిగింది. తను నాతో ఎక్కువ సమయం ఉంటోంది. అందుకే ఇగ్నోర్ చేస్తున్నా. అప్పుడైనా అటు (అభిజిత్) వెళ్తుందని అని చెప్తాడు.

అయితే నువ్వు ఇగ్నోర్ చేయడం మంచిది కాదు. ఆమె వెళ్లాలనుకుంటే వెళ్తుంది. నీతో ఉంటే బావుండు. ఎవరో ఒకరైతే తగ్గాలి కదా లాస్య హితోపదేశం చేసింది.  ఈ క్రమంలో మోనాల్‌తో మాట్లాడేందుకు అఖిల్ ఆమెను పిలిచాడు. దీంతో మోనాల్‌ నవ్వుతూ అఖిల్ వద్దకు వెళుతుంది. ‘ఎదవ ఓవరాక్షన్ చేయకు. మూసుకుని నడువు. నువ్వు అందరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరి గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు. ఏం తెలియదా..? నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తుంటే నేను తీసుకోలేదా?’ అని అఖిల్ అడిగాడు. దీంతో ఎక్కడ తీసుకున్నావు అని మోనాల్ అడగంతో.. ఇక్కడ అంటూ తన హార్ట్ చూపించి మోనాల్‌ హార్ట్ బీట్ పెంచే ప్రయత్నం చేశాడు.

ఆ మాటకు మోనాల్ సిగ్గుపడిపోతూ హో అక్కడా అని అనడంతో.. సారీ ఇక్కడ లేదులే అంటూ మళ్లీ అఖిల్‌ తన హార్ట్ చూపించాడు. ఇలా వీరిద్దరి మధ్య చర్చ చాలాసేపు జరిగింది. చివరికి.. నాకు అభితో ఏం లేదు. నీతో ఏం లేదు. కానీ నీతో టైమ్‌ స్పెండ్ చేయడం ఇష్టం. అది అర్థం చేసుకో.  అది నా ఫీలింగ్ అంటూ మోనాల్ క్లారిటీ ఇచ్చింది.

ఇక ప్రతి సోమవారం ఇంటి సభ్యులకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని, అందుకోసం రేషన్ మేనేజర్ నియమించడం జరుగుతుందని అది చాలా ముఖ్యమైన పదవని కెప్టెన్ లాస్య చదివి వినిపించింది. రేషన్ మేనేజర్ ఇంటి సభ్యులకు రేషన్ అందజేస్తాడని, ప్రతిసారి రేషన్ ఇచ్చినప్పుడు అతడికి 1000 లగ్జరీ పాయింట్లు లభిస్తాయని, వాటితో తనకు కావాల్సిన వాటిని కొనుక్కోవచ్చునని, రేషన్ రూం తాళం కూడా అతడి దగ్గరే ఉంటుందని బిగ్‌బాస్ తెలిపారు. ఇక రేషన్ మేనేజర్‌ని ఎంపిక చేసే బాధ్యతను బిగ్‌బాస్ లాస్యకు ఇచ్చారు.

అయితే కిచెన్‌లో ఉన్న వాళ్లకు రేషన్ గురించి పూర్తి అవగాహన ఉంటుందని, అందుకే కిచెన్‌లో పనిచేసిన వాళ్లకే రేషన్ మేనేజర్ ఇస్తే బావుంటుందని లాస్య చెప్పింది. దీంతో యాంకర్ దేవి విభేదించింది. తాను రేషన్ మేనేజర్‌గా ఉంటానని, కిచెన్‌లో ఉంటేనే రేషన్ మేనేజర్ అని అనడం సరికాదని చెప్పింది. అయితే కెప్టెన్ నిర్ణయమే ఫైనల్ కావడంతో అమ్మా రాజశేఖర్‌ని రేషన్ మేనేజర్‌గా లాస్య నియమించింది.

ఇదిలా ఉంటే రెండోవారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో బాగంగా ఇంటి సభ్యులకు పడవ టాస్క్‌ ఇచ్చారు బిగ్‌బాస్. ఓ పడవ ఇచ్చి అందులో ఇంటిలో ఉన్న 16 మందిలో 15 మందిని ఎక్కి కూర్చోవాలని చెప్పారు. లాస్య కెప్టెన్ కావడంతో ఆమెకు మినహాయింపు ఇచ్చారు. ఈ పడవ తొమ్మిది తీరాలకు చేరుతుందని, తీరం చేరిన ప్రతిసారి పడవలో ఉన్న ఒకరు దిగాల్సి ఉంటుందని, అలా పడవ దిగిన కంటెస్టెంట్ ఎలిమినేషన్‌కి నామినేట్ అవుతారని బిగ్‌బాస్ చెబుతాడు. దీంతో 15 మంది కుటుంబ సభ్యులు పడవ ఎక్కడం మొదలుపెడతారు. ఇక ఎవరు దిగాలన్న దానిపై సభ్యులు చర్చించుకుంటూ ఉంటారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కుమార్ సాయిని దిగాలని నోయల్ కోరాడు. అందరూ మాట్లాడుకుని తాను దిగాలని భావిస్తే తప్పకుండా దిగుతానని సాయి కుమార్ అన్నాడు.

అయితే గంగవ్వ ఇక్కడ ఉండటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా పడవలో ఎక్కువ సేపు కూర్చోలేరు. ఆమెను దింపితే బావుంటుందని అభిజిత్ అంటాడు. ఇక గంగవ్వను పడవ దిగుతావా అని అడగ్గా.. నేను దిగను అంటూ చెబుతుంది. అయితే కాళ్లు పట్టేయడంతో పడవ దిగి నామినేషన్‌లోకి వచ్చింది. తొమ్మది మంది ఎలాగైనా దిగాలని, అందుకే తాను దిగా అని గంగవ్వ చెప్పింది. ఆ తరువాత నోయల్ కూడా తనంతట తాను పడవ దిగాడు. నోయల్ తరువాత మోనాల్ కూడా సెల్ఫ్ నామినేట్ అవుతుంది. ఆ తరువాత పడవ దిగి నామినేట్ అయ్యేందుకు అక్కడున్న వారిలో చాలాసేపు చర్చ జరిగింది. ఇక సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణిలు సెల్ఫ్ నామినేట్ కావడంతో సాయి కుమార్‌ కూడా సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఆ తరువాత దేత్తడి హారిక, అభిజిత్‌లు కూడా సెల్ఫ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఈ వారం ఒకరిని ఇంటికి పంపనున్నారు. కాగా మొదటి వారం కాస్త సోసోగానే నడిచినప్పటికీ, ఈ వారం బిగ్‌బాస్ కాస్త ఇంట్రస్టింగ్‌గా మారింది.