AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: తెలంగాణలో మళ్లీ మొదటికొచ్చిన వరి యుద్ధం.. TRS-BJP వ్యూహం ఏమిటో..?

Big News Big Debate: తెలంగాణలో వరిపై యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. యాసంగి పంట చేతికొస్తున్న తరుణంలో ఎవరు కొనాలన్న దానిపై పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Big News Big Debate: తెలంగాణలో మళ్లీ మొదటికొచ్చిన వరి యుద్ధం.. TRS-BJP వ్యూహం ఏమిటో..?
Big News Big Debate
Shaik Madar Saheb
|

Updated on: Mar 22, 2022 | 8:37 PM

Share

Big News Big Debate: తెలంగాణలో వరిపై యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. యాసంగి పంట చేతికొస్తున్న తరుణంలో ఎవరు కొనాలన్న దానిపై పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బియ్యం కాదు వడ్లు కొనాల్సిందేనంటూ KCR వ్యూహం మారిస్తే.. రా రైస్‌ ఎంతిచ్చినా సరే బాయిల్డ్‌ మాత్రం వద్దంటోంది కేంద్రం. పేచీ మళ్లీ బాయిల్డ్‌ దగ్గర వచ్చి ఆగడంతో వరి వార్‌ కాస్తా హస్తినకు చేరింది.

వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటున్నారు కేసీఆర్‌.

రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం ఎంతైనా సరే సేకరించడానికి సిద్దమంటోంది కేంద్రం.

రాష్ట్రం అడిగితే కేంద్రం OK అంటోంది. కానీ ఇక్కడే పీటముడి పడుతోంది. రా రైస్‌ ఎంతిచ్చినా తీసుకోవడానికి రెడీ అంటోంది కేంద్రం. అయితే తెలంగాణలో పండుతున్న యాసంగి పంట బాయిల్డ్‌ రైస్‌కు మాత్రమే పనికొస్తుందని గతంలోనే క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి kcr.

గతంలో ఇచ్చినట్టు బియ్యంగా మార్చితే కేంద్రం తీసుకునే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వ్యూహం మార్చింది. పంజాబ్‌ తరహాలో వడ్లు సేకరించాలంటూ కేంద్రం కోర్టులో బంతిని తోశారు కేసీఆర్‌.

దీనిపై బీజేపీ నాయకుల వెర్షన్‌ మరోలా ఉంది. దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలోనే ఎందుకు సమస్య వస్తుందని ప్రశ్నిస్తోంది. భవిష్యత్తులో తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసిందని.. రా రైస్‌ ఎంతిచ్చినా ఒకే అంటోంది. వరి వేస్తే ఉరేనని, కొనుగోలు కేంద్రాలు ఉండవని రైతులకు వార్నింగ్‌ ఇచ్చింది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నిస్తోంది బీజేపీ. కేంద్రం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తుందని కౌంటర్‌ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు.

వరి విషయంలో కేంద్ర, రాష్ట్రాలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించింది కాంగ్రెస్. తమకు అప్పగిస్తే రెండు రోజుల్లో పంటంతా సేకరించి చూపిస్తామంటున్నారు ఆ పార్టీ ఎంపీలు.

మొత్తానికి వరిపై యుద్ధం గల్లీ నుంచి ఢిల్లీకి మారింది. మరి రాష్ట్రం డిమాండ్‌ చేస్తున్నట్టు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుందా? తాడో పేడో తేల్చుకుంటామన్న కేసీఆర్‌ దీనిపై ఎలాంటి ఎత్తుగడలతో వెళతారు.

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే