ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సమయానికి కారు బెలున్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కారు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఆడమిల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
వేగంతో ఉన్న కారు.. నేరుగా రోడ్డు పక్కనున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సమయంలో కార్లోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే మరో కారులో జంగారెడ్డి గూడెం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ఈ కారులో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా, ఆయన కుటుంబసభ్యులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..