ఎండుతున్న పంటలు.. కన్నీళ్లు పెడుతున్న రైతన్న
వేసవి కాలం మొదట్లోనే నీళ్లు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మెట్ట ప్రాంతమైన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతంలో రిజర్వాయర్లు, పెద్ద చెరువులు లేకపోవడంతో రైతులు వర్షాలపైనే ఆధారపడుతున్నారు. కొద్దిపాటిగా కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు ఉండటంతో ఆరు తడి పంటలు వేసుకున్నారు రైతులు. ఇప్పుడు ఈ పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఎండలకు చెరువుల్లో నీళ్లు మొత్తం అడుగంటి పోయాయి. దీంతో బావుల్లో కూడా నీళ్లు […]
వేసవి కాలం మొదట్లోనే నీళ్లు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మెట్ట ప్రాంతమైన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతంలో రిజర్వాయర్లు, పెద్ద చెరువులు లేకపోవడంతో రైతులు వర్షాలపైనే ఆధారపడుతున్నారు. కొద్దిపాటిగా కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు ఉండటంతో ఆరు తడి పంటలు వేసుకున్నారు రైతులు. ఇప్పుడు ఈ పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఎండలకు చెరువుల్లో నీళ్లు మొత్తం అడుగంటి పోయాయి. దీంతో బావుల్లో కూడా నీళ్లు పాతాళానికి చేరుకున్నాయి. ఎండిన పంటలను చూసి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.