AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన దేశభక్తి

దేశవ్యాప్తంగా అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వీర సైనికుల మృత దేహాలను వారి సొంత ఊళ్లకు పంపారు. దీంతో ఆయా గ్రామలు భారత్ మాతాకీ జై నినాదంతో మార్మోగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణాల మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరులో భారత జవాన్లపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు, ఆర్యవైశ్య సంఘం, టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ట్టణంలోని గాంధీ చౌక్ వద్ద జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు అహర్నిషలు కృషి చేసే సైనికులపై ఉగ్రవాదులు […]

దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన దేశభక్తి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 16, 2019 | 3:29 PM

Share

దేశవ్యాప్తంగా అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వీర సైనికుల మృత దేహాలను వారి సొంత ఊళ్లకు పంపారు. దీంతో ఆయా గ్రామలు భారత్ మాతాకీ జై నినాదంతో మార్మోగుతున్నాయి.

అదేవిధంగా తెలంగాణాల మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరులో భారత జవాన్లపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు, ఆర్యవైశ్య సంఘం, టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ట్టణంలోని గాంధీ చౌక్ వద్ద జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు అహర్నిషలు కృషి చేసే సైనికులపై ఉగ్రవాదులు దాడి చేయటం పిరికి పంద చర్య అని మండిపడ్డారు జర్నలిస్టులు.

అలాగే.. నిజామాబాద్ లో బీజేపీ నాయకులు పాకిస్తాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగరంలోని కార్గిల్ చౌర్తా వద్ద మరణించిన సైనికులకు నివాళులర్పించారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే దాడులకు పాల్పడితే భారత సైన్యం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.