బ్రేకింగ్: కడపలో ఘోర ప్రమాదం.. 25 మంది!

| Edited By:

Jan 05, 2020 | 7:13 AM

కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఢీ కొంది. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. కాగా.. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ నుంచి 20 రోజుల కిందట బయలుదేరిన యాత్రికుల బృందం తిరుమల వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. అయితే.. పొగమంచు కారణంగానే […]

బ్రేకింగ్: కడపలో ఘోర ప్రమాదం.. 25 మంది!
Follow us on

కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఢీ కొంది. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. కాగా.. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ నుంచి 20 రోజుల కిందట బయలుదేరిన యాత్రికుల బృందం తిరుమల వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. అయితే.. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.