టీడీపీలోకి కోట్ల చేరికకు ముహూర్తం ఖరారు
ఎట్టకేలకు ఊహాగానాలకు తెరపడింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా కోడుమూరులో లక్షమందితో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కోట్ల, మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన ఎంపీ స్థానానికి బరిలో దిగనుండగా.. ఆలూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా […]
ఎట్టకేలకు ఊహాగానాలకు తెరపడింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా కోడుమూరులో లక్షమందితో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కోట్ల, మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన ఎంపీ స్థానానికి బరిలో దిగనుండగా.. ఆలూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా తమ కుటుంబానికే కేటాయించాలని కోట్ల కోరినట్లు సమాచారం.