AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి: ఉపరాష్ట్రపతి

తిరుపతి: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని, అలా అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో రన్ వే పొడిగింపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలని కోరారు. ఇరు ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతూ త్వరలో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు […]

కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి: ఉపరాష్ట్రపతి
Ram Naramaneni
|

Updated on: Feb 20, 2019 | 3:48 PM

Share

తిరుపతి: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని, అలా అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో రన్ వే పొడిగింపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలని కోరారు. ఇరు ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతూ త్వరలో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానిస్తామని తెలిపారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.