Watch Video: ‘చంద్రబాబును కొత్తగా పొగుడ్తున్నా అనుకోవద్దు’.. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం చాల బలమైనదని చెప్పారు. ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వదించారు.

Watch Video: 'చంద్రబాబును కొత్తగా పొగుడ్తున్నా అనుకోవద్దు'.. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి
Swarupananda Swami
Follow us

|

Updated on: Jun 10, 2024 | 12:30 PM

విశాఖపట్నం, జూన్ 10: రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం చాల బలమైనదని చెప్పారు. ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వదించారు. కేంద్రంతో ఉండే సన్నిహిత, సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నానన్నారు. అమరావతిలో కూడా శారదా పీఠం నిర్మిస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలోనే చాతుర్మాస పూజలకోసం రుషికేశ్ వెళ్తున్నా, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నానన్నారు.

చాతుర్మాస దీక్ష అనంతరం హైదరాబాద్‎లోని శారదా పీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు అత్యంత ఆత్మీయుడు అయిన ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్‎లో మంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. అమ్మ వారి కృప చేత మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించిందని చెప్పారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతూ ఉన్నానని అనుకోవద్దన్నారు. గతంలో ఆయన గెలవాలని మురళీమోహన్‎తో సమావేశం జరిపినట్లు తెలిపారు. అందులో భాగంగా సాధువులందరితో కలిసి పూజలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. ఎవరికీ భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం లేదన్నారు. తనపై, శారదాపీఠంపై తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండాలని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవం అన్నారు. ఆయన చాలా సీనియర్ నేతని.. మరికొన్ని కాలాలపాటు ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకున్నారు. ఈసారైనా దేవాలయాల పాలన బాగుండేలా చూడాలని స్వరూపానంద విజ్ఙప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!