ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి

|

Mar 30, 2023 | 6:59 PM

ఇటీవల చెరువులు లేదా కాలువలో ఈతకు వెళ్లి యువకులు గల్లంతవ్వడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది.

ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి
Drowning
Follow us on

ఇటీవల చెరువులు లేదా కాలువలో ఈతకు వెళ్లి యువకులు గల్లంతవ్వడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామానికి చెందిన కేసర రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాశారు.

అయితే ఇంటర్ పరీక్షలు పూర్తవడంతో కృష్ణానదిలో రాజశేఖర్ రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లారు. ఒక్కసారిగా లోతులోకి దిగిపోవడంతో రాజశేఖర్ రెడ్డి,మల్లిఖార్జున్ రెడ్డి గల్లంతై మృతి చెందారు. మరో ఇద్దరిని అక్కడున్న స్థానికులు బయటకు లాగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం