AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Accident: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తుల కారుకి యాక్సిడెంట్.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Tirumala Accident: తిరుమల తిరుపతి లో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న ముగ్గురు భక్తులు గాయపడ్డారు. తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో..

Tirumala Accident: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తుల కారుకి యాక్సిడెంట్.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Tirumala Accident
Surya Kala
|

Updated on: Sep 11, 2021 | 2:58 PM

Share

Tirumala Accident: తిరుమల తిరుపతి లో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న ముగ్గురు భక్తులు గాయపడ్డారు. తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో రెండవ టర్నింగ్ వద్ద ఓ కారు పిట్టగోడను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటెనే క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు తెలంగాణ మెదక్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. కె కృష్ణ అనే 39 ఏళ్ల వ్యక్తి సంఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోడు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read :  ఐసీయూలో తేజు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న జూ. ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ, సినీ నటీనటులు

సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు