AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: భర్త ఏమో సంసారానికి పనికిరాడు.. బావ ఏమో వేధిస్తున్నాడు.. ఆమె ఏం చేసిందంటే..?

పెళ్లి అయిన వారం రోజులకే భర్త సంసారానికి పనికిరాడని తెలిసింది. అయినా ఆమె ఆ విషయం బటయకు చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకుని బావ వేధింపులకు పాల్పడ్డాడు.. దీంతో...

Tirupati: భర్త ఏమో సంసారానికి పనికిరాడు.. బావ ఏమో వేధిస్తున్నాడు.. ఆమె ఏం చేసిందంటే..?
Ramachandrapuram Ps
Ram Naramaneni
|

Updated on: May 02, 2022 | 1:23 PM

Share

తిరుపతి రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌ ముందు వివాహిత న్యాయ పోరాటం చేస్తోంది. అత్తింటివారి వేధింపులు, టార్చర్‌ భరించలేక న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించింది. తన భర్త కాపురానికి పనికిరాడని తెలిసి కూడా పెళ్లి చేయడమే కాకుండా..అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని రోధిస్తోంది. అంతేకాదు బావ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వాపోతోంది. రెండేళ్ల క్రితం కార్వేటినగర్‌కు చెందిన సుబ్రమణ్యంతో ఆమెకు పెళ్లి జరిగింది. భర్త సంసారానికి పనికిరాడన్న విషయం పెళ్లైన వారం రోజుల్లోనే తెలిసిందని.. దానిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపస్తోంది. ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేయ లేదని, ఎస్ఐ ఎర్రిస్వామి డబ్బు తీసుకుని కేసు కట్టడం లేదని ఆరోపిస్తోంది.

Also Read: Tirupati: తిరుమల ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు