TTD: టీటీడీకి కళ్లు చెదిరే విరాళం ఇచ్చిన చెన్నై భక్తురాలు.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా.. 

|

Feb 17, 2022 | 2:17 PM

తిరుమల శ్రీవెంకటేశ్వరుడికి భారీ విరాళం అందించారు ఓ భక్తురాలు దాదాపు 9.20 కోట్లు రూపాయలను విరాళంగా ఇచ్చారు. చెన్నైలోని

TTD: టీటీడీకి కళ్లు చెదిరే విరాళం ఇచ్చిన చెన్నై భక్తురాలు.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా.. 
Ttd
Follow us on

తిరుమల శ్రీవెంకటేశ్వరుడికి భారీ విరాళం అందించారు ఓ భక్తురాలు. దాదాపు  రూ. 9.20 కోట్ల విలువైన నగదు, ఆస్తిని స్వామివారికి విరాళంగా ఇచ్చారు. చెన్నైలోని మైలాపూర్‏కు చెందిన రేవతి విశ్వనాథం అనే మహిళ.. ఆమె సొదరి డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకార్థం సోదరి ఆస్తిని టీటీడీకి విరాళంగా ఇచ్చింది. ఇందులో రూ. 3 కోట్ల 20 లక్షల రూపాయల నగదు కాగా.. రూ. 6 కోట్లు రూపాయల విలువైన రెండు ఇళ్లు  ఉన్నాయి. ఈ మొత్తం విరాళాన్ని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రేవతి విశ్వనాథం  అందచేశారు. భక్తురాలు ఇచ్చిన విరాళంలో రూ. 3 కోట్ల 20 లక్షల నగదును చిన్న పిల్లల ఆసుపత్రికి వినియోగించనున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ. చిన్నపిల్లల సూూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ టికెట్లను బుధవారం ఉదయం ఆన్‏లైన్‏లోఅందుబాటులో ఉంచింది. బుధవారం ఉదయం స్వామివారి ఉదయాస్తమాన సేవ టికెట్స్ బుకింగ్ డోనేషన్ విండోను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. అలాగే టీటీడీకి విరాళాలు అందించాలనుకున్న భక్తులు వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…