AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో మీరు కూడ అన్నదానం చేయొచ్చు.. ఒక్కరోజు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెడితే ఆ పుణ్యం జన్మజన్మలకు ప్రాప్తిస్తుంది. అన్నదానం చేయడం ఒక రకంగా దేవుడికి సేవ చేయడమే అని పండితులు చెబుతున్నారు. అలాంటిది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి సన్నిధి తిరుమల తిరుపతిలో అన్నదానం చేసే భాగ్యం భక్తులకు అందుబాటులో ఉంది.

Tirumala: తిరుమలలో మీరు కూడ అన్నదానం చేయొచ్చు.. ఒక్కరోజు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
Tirumala Annaprasadam
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2025 | 2:58 PM

Share

తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విష‌యం విదిత‌మే. అయితే భక్తులు ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ – రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం – రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం – రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం – రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.

తిరుమల, తిరుప‌తిల‌లో ప్రస్తుతం అన్నప్రసాదాలు విత‌ర‌ణ చేస్తున్న‌ ప్రాంతాలు

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.

ప్రస్తుతం టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల, తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ( టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తున్నది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి