AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏంటి ఫ్రెండ్ ఇలా చేశావ్.. కళ్ల ముందే స్నేహితుడి మరణంతో..

చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన స్నేహితులు మురళీ కృష్ణ, ప్రశాంత్, ధనుష్ లు సరదాగా ఈత కొట్టేందుకు శ్రీకాళహస్తి మండలం కన్నలి వద్ద తెలుగు గంగ కాలువ వద్దకు వెళ్లారు. మురళీ కృష్ణ ధనుష్, ప్రశాంత్ ముగ్గురూ.. కలిసి తెలుగు గంగ కాలువలో ఈత కొట్టారు. ఈ క్రమంలోనే..

Andhra: ఏంటి ఫ్రెండ్ ఇలా చేశావ్.. కళ్ల ముందే స్నేహితుడి మరణంతో..
Crime News
Raju M P R
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 15, 2025 | 8:45 AM

Share

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చుక్కల నిడిగల్లు గ్రామంలో మిత్రుడి మరణాన్ని తట్టుకోలేని ఓ స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే ఈ నెల 12న సరదాగా ముగ్గురు స్నేహితులు కలిసి తెలుగుగంగ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్ళారు. అక్కడ నీటిలో ఒకరు మరణించారు. దీంతో అతని మరణాన్ని తట్టుకోని మరో స్నేహితుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు..

చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన స్నేహితులు మురళీ కృష్ణ, ప్రశాంత్, ధనుష్ లు సరదాగా ఈత కొట్టేందుకు శ్రీకాళహస్తి మండలం కన్నలి వద్ద తెలుగు గంగ కాలువ వద్దకు వెళ్లారు. మురళీ కృష్ణ ధనుష్, ప్రశాంత్ ముగ్గురూ.. కలిసి తెలుగు గంగ కాలువలో ఈత కొట్టారు. ఈ క్రమంలోనే.. తెలుగు గంగ కాలువలో నీటి ప్రవాహం ఉదృతంగా ఉండటంతో మురళీ కృష్ణ కొట్టుకు పోయాడు.. కొంతదూరం వెళ్ళాక అతి కష్టంపై ఎట్టకేలకు ధనుష్, ప్రశాంత్ లు ఇద్దరూ కాలువ గట్టుకు చేరారు.

మురళీ మాత్రం గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపారు. మురళీ ఆచూకీ లభించకపోవడంతో అతని తల్లిదండ్రులు శ్రీకాళహస్తి రూరల్ పోలీసులను ఆశ్రయించారు.గల్లంతైన మురళీ క్రిష్ణ ఆచూకీ కోసం ప్రయత్నించిన పోలీసులు ఎట్టకేలకు డెడ్ బాడీని గుర్తించారు. గజ ఈతగాళ్ళ సాయంతో గల్లంతైన మురళి కృష్ణ మృతదేహం మరుసటి రోజు ఈ నెల 13న లభ్యం అయ్యింది. అదే రోజు సాయంత్రం మురళీకృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ముగ్గురిది చిన్ననాటి స్నేహం కావడంతో మురళీ కృష్ణ జ్ఞాపకాలు ప్రశాంత్ ను వీడలేదు. మురళీ దహన క్రియల అనంతరం పురుగుల మందు తాగి ప్రశాంత్ ఆత్మహత్య యత్నం చేసాడు. ప్రశాంత్ సూసైడ్ అటెంమ్ట్ చేయడంతో తల్లిదండ్రులు, స్నేహితులు శ్రీకాళహస్తి లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే.. ప్రశాంత్ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ప్రశాంత్ తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు.

ఒకరు నీటిలో మునిగి చనిపోగా.. మరొకరు ప్రాణ స్నేహితుడు మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న.. ఘటనలు రెండు కుటుంబాలతోపాటు.. గ్రామమంతా విషాదంలో మునిగిపోయేలా చేశాయి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..