AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేడు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కీలక భేటీ.. అందరి దృష్టి ఈ భేటీపైనే.. ఎందుకంటే..

Andhra Pradesh: ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ క‌మిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ భేటీ కానుంది. తమ వద్ద పెండింగులో ఉన్న సభా హక్కుల ఉల్లంఘ‌న..

Andhra Pradesh: నేడు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కీలక భేటీ.. అందరి దృష్టి ఈ భేటీపైనే.. ఎందుకంటే..
Ap Assembly
Shiva Prajapati
|

Updated on: Sep 14, 2021 | 6:58 AM

Share

Andhra Pradesh: ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ క‌మిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ భేటీ కానుంది. తమ వద్ద పెండింగులో ఉన్న సభా హక్కుల ఉల్లంఘ‌న కేసుల‌పై చ‌ర్చించ‌నుంది. అందులో టీడీపీ నేత‌లు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కూన రవి కుమార్, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తమ వద్ద ఉన్న పిటిషన్లపై చ‌ర్చించ‌నుంది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన ర‌వికుమార్ లు గ‌త ప్రివిలేజ్ క‌మిటీ ముందు వ్యక్తిగ‌తంగా హ‌జ‌రుకావాల్సి ఉన్నా.. అచ్చన్నాయుడు మాత్రం ప్రివిలేజ్ క‌మిటీకి లేఖ ద్వారా త‌న అందుబాటులో లేన‌ని స‌మాచారం ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన ర‌వికూమార్ మాత్రం ఎలాంటి స‌మాచారం ఇవ్వకుండానే విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. దీనిని ప్రివిలేజ్ క‌మిటీ సీరియ‌స్ గా తీసుకుంది. కూన ర‌వి కుమార్ వ్యవ‌హారాన్ని ధిక్కారంగా భావిస్తూ అయ‌న పై త‌దుప‌రి స‌మావేశంలో చ‌ర్యలపై నిర్ణయం తీసుకోవాల‌ని గ‌త ప్రివిలేజ్ క‌మిటీ భేటీలో నిర్ణయించారు.

కాగా, స్పీక‌ర్ తమ్మినేని సీతారాంపై వివిధ సందర్భాల్లో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఇద్దరూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అచ్చెన్నాయుడుపై జోగి రమేష్, కూన రవి కుమార్‌పై ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారం అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదు చేశారు. స్పీక‌ర్ పై ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారనే అంశంపై ప్రివిలేజ్ క‌మిటీ అచ్చన్నాయుడు, కూన‌రవి కుమార్ ల‌పై విచార‌ణ జ‌రుపుతోంది. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు తనకు ఇచ్చిన నోటీసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందివ్వాలని ప్రివిలేజ్ కమిటీని గ‌తంలో కోరారు. దీనిపై రామానాయుడు కోరిన విధంగా స‌మాచారం పంపింది కమిటీ. అలాగే తాను చేసిన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి ఎలా వస్తాయో చెప్పాలని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరగా.. ఆ మేర‌కు స‌మాచారాన్ని ఆయనకు కూడా పంపింది ప్రివిలేజ్ క‌మిటీ. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగనున్న ప్రివిలేజ్ క‌మిటీ స‌మావ‌శంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీల‌కంగా మారింది.

Also read:

Bigg Bigg 5 Telugu: వామ్మో.. ఇదేక్కడి గోల రా బాబు.. నామినేట్ చేయమంటే నోటికి పని చెప్పారు… బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్..

Pani Puri: చిరు వ్యాపారి గొప్పతనం.. ఆడపిల్ల పుట్టిందని రూ.50 వేల ఖర్చు.. అసలేం చేశాడంటే..?

Horoscope Today: ఈ రాశి వారికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు.. అనవసరమైన ఖర్చులు..!

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..