AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటల పాటు సేవలు.. రాత్రి వేళల్లో కూడా..

ఏపీ ప్రజలకు పోస్టల్ శాఖ తీపికబురు అందించింది. అదేంటంటే.. ఇక నుంచి ఎప్పుడైనా పోస్ట్‌లు పంపించుకోవచ్చు. పోస్టాఫీస్ పనివేళలతో ఇక నుంచి సంబంధం లేదు. రాత్రి వేళల్లో కూడా స్పీడ్ పోస్ట్‌లు, పార్శిల్స్ పంచుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రజలకు అవకాశం అందుబాటులోకి వచ్చింది.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటల పాటు సేవలు.. రాత్రి వేళల్లో కూడా..
Andhra Pradesh
Venkatrao Lella
|

Updated on: Feb 25, 2026 | 6:53 PM

Share

ఏపీలోని ప్రజలకు పోస్టల్ శాఖ శుభవార్త అందించింది. ఇకపై 24 గంటల పాటు ఎప్పుడైనా పోస్టల్ సేవలు పొందవచ్చు. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24/7 పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంతకల్లు సిటీల్లో నిరంతర పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పోస్టల్ శాఖ అధికారులు తాజాగా ఈ సేవను ప్రారంభించగా.. ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక నుంచి 24 గంటల పాటు ప్రజలు స్పీడ్ పోస్టులు, పార్సిల్స్ పోస్టల్ శాఖ ద్వారా పంపించుకోవచ్చు. పని వేళలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సేవలు పొందవచ్చు. రాత్రి వేళల్లో కూడా అత్యవసరంగా ఏదైనా పంపించాలంటే వెంటనే పంపించవచ్చు.

పనివేళల్లో మార్పులు

ఇక ఏపీవ్యాప్తంగా ఉన్న 242 పట్టణాల్లో పోస్టాఫీస్ పనివేళల్లో మార్పులకు పోస్టల్ శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న పనివేళలను 1 నుంచి 2 గంటల పాటు పొడిగించారు. దీని వల్ల ప్రజలకు మరింతగా పోస్టల్ శాఖలు అందనున్నాయని అధికారులు తెలిపారు. 24 గంటల సేవలతో పాటు పనివేళల పెంపు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటివరకు పోస్టాఫీస్ పనివేళల్లోనే స్పీడ్ పోస్టులు లేదా పార్సిల్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ ప్రజలకు నిరంతరం సేవలు అందించేందుకు పోస్టల్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సాంకేతికతను కూడా ఉపయోగించుకుంటోంది. ఇటీవల పోస్టల్ శాఖకు సంబంధఇంచిన ఐటీ 2.0 సాప్ట్‌వేర్‌ను జీపీవో, సబ్ పోస్ట్ ఆఫీసులకు లింక్ చేశారు. దీంతో పోస్టల్ సేవల్లో వేగం పెరిగింది.

పోస్టల్ ఏటీఎంలు

ఇక ఇప్పటివరకు పోస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం అందుబాటులోకి లేకపోతే పోస్టల్ సిబ్బంది వెనక్కి తీసుకెళ్తారు. మనం మళ్లీ పోస్టాఫీసుకు వెళ్లి దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. దూరపు ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంటికి పోస్ట్ వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరూ లేనప్పుడు  ఇబ్బంది అవుతుంది. దీనిని పరిష్కరించేందుకు ఏటీఎంలను పోస్టల్ శాఖ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మీరు నెంబర్ ఎంటర్ చేసి మీ పోస్ట్ తీసుకోవచ్చు. హైదరాబాద్‌లోని కొన్ని సర్కిళ్లల్లో ఇలాంటి తరహా ఏటీఎంలను పోస్టల్ శాఖ ఇటీవల ప్రవేశపెట్టింది. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.

Follow Us
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఇక 24 గంటల పాటు సేవలు
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఇక 24 గంటల పాటు సేవలు
ఆయన అన్నం పెట్టాడు.. ఆవిడ కన్నం వేసింది..! కట్‌చేస్తే..36 గంటల్లో
ఆయన అన్నం పెట్టాడు.. ఆవిడ కన్నం వేసింది..! కట్‌చేస్తే..36 గంటల్లో
మార్చి నెలలలో వారికి అంతా హ్యాపీ..! ఇందులో మీ రాశి ఉందా?
మార్చి నెలలలో వారికి అంతా హ్యాపీ..! ఇందులో మీ రాశి ఉందా?
ముదురు మటన్‌ మెత్తగా, త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి..
ముదురు మటన్‌ మెత్తగా, త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి..
బంగారం రేంజ్‌కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
బంగారం రేంజ్‌కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
రైతుల కోసం కేంద్రం మరో కొత్త నిర్ణయం.. అందరికీ బెనిఫిట్
రైతుల కోసం కేంద్రం మరో కొత్త నిర్ణయం.. అందరికీ బెనిఫిట్
భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు..స్వామివారి పట్టు వస్త్రాలు మాయం
భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు..స్వామివారి పట్టు వస్త్రాలు మాయం
శుక్రుడితో వారికి లక్ష్మీ కటాక్షం.. వారి లైఫ్ స్టైల్ మారిపోవడం..
శుక్రుడితో వారికి లక్ష్మీ కటాక్షం.. వారి లైఫ్ స్టైల్ మారిపోవడం..
అరె ఏంట్రా ఇది! ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్.. అమ్మాయి ఎవరంటే?
అరె ఏంట్రా ఇది! ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్.. అమ్మాయి ఎవరంటే?
త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్
త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్