Remote Voting Machine: రిమోట్ ఓటింగ్ సిస్టమ్‌పై విపక్షాల అభ్యంతరం.. తమ అభిప్రాయలు వినాలని డిమాండ్..

కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టాలనుకుంటున్న రిమోట్ ఓటింగ్‌ సిస్టమ్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విధానాన్ని విపక్షాలన్నీ

Remote Voting Machine: రిమోట్ ఓటింగ్ సిస్టమ్‌పై విపక్షాల అభ్యంతరం.. తమ అభిప్రాయలు వినాలని డిమాండ్..
Remote Voting System

Updated on: Jan 17, 2023 | 9:49 AM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టాలనుకుంటున్న రిమోట్ ఓటింగ్‌ సిస్టమ్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విధానాన్ని విపక్షాలన్నీ వ్యతిరేకించాయి. మైగ్రెంట్ వర్కర్స్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ పద్ధతి తెచ్చామంటోంది ఈసీ. అయితే పలు పార్టీలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశాయి. సంప్రదింపులు కాకుండానే మిషిన్‌లను ఎలా తయారు చేశారని ప్రశ్నించాయి. ముందుగా తమ అభిప్రాయాలను వినాలని డిమాండ్ చేశాయి. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేసింది టీడీపీ. రిమోట్‌ ఓటింగ్ సిస్టమ్‌పై ప్రతి రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశానికి 8 జాతీయ పార్టీలు, 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్వీఎం నమూనాను ప్రదర్శించింది. వలస ఓటర్లపై శాస్త్రీయ సర్వే లేకుండా వారిని ఎలా గుర్తిస్తారని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26 వరకు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలిపేందుకు ఎన్నికల సంఘం గడువు పెంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us