Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: త్వరలోనే ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం.. మంత్రి విడదల రజినీ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) చేతుల....

Andhra Pradesh: త్వరలోనే ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం.. మంత్రి విడదల రజినీ కీలక ప్రకటన
Vidadala Rajini
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:11 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతున్నయో తెలుసుకునేందుకు ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానం అమల్లోకి వస్తే.. ఇంటింటికి ప్రభుత్వమే వైద్యసేవలు అందిస్తుందని చెప్పారు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం కొత్తగా సిబ్బందిని నియమించుకుంటామని చెప్పారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 65 రకాల మందులు అందుబాటులో ఉంచామన్న మంత్రి (Vidadala Rajini).. వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ప్రత్యేక యాప్‌లనూ అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. ఎంఎంయూ వాహనాలను 45 రోజుల్లో సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.

పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటైన ఆరోగ్యశ శ్రీ పరిధిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరింతగా పెంచారు. ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన వారికి ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్యవిధానం ద్వారా అదనంగా వైద్యసేవలు అందుతాయి. వైద్యులు, ఏఎన్‌ఎంలు వారి ఇళ్లకు వెళ్లి సేవలందిస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన బాధితులు సేవల పట్ల సంతృప్తి చెందకపోతే ఫిర్యాదు చేయాలి. తద్వారా ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల్లో నెలకు కనీసం పది డెలివరీలు అయినా చేయాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మాతా శిశు మరణాలు సున్నాకు తగ్గాయి.

– విడదల రజినీ, ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. ఆరోగ్య శ్రీ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్‌లో చెల్లింపులు జరగాలని సీఎం జగన్ గతంలో అధికారులకు ఆదేశించారు. పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు సీఎం కు వెల్లడించారు.

కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు.. అతను మాత్రం ఎలా ఎక్కాడు
కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు.. అతను మాత్రం ఎలా ఎక్కాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే..
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. కనిపిస్తే అస్సలు వదలొద్దు..
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. కనిపిస్తే అస్సలు వదలొద్దు..
ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..