AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీ క్యాబినెట్లో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక నిర్ణయం.. మంత్రి వేణుగోపాల్ వెల్లడి

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన ఈ మంత్రివర్గ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ క్యాబినెట్ భేటి ఆసక్తిని సంతరించుకుంది.

AP News: ఏపీ క్యాబినెట్లో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక నిర్ణయం.. మంత్రి వేణుగోపాల్ వెల్లడి
Ap Minister Venugopal
Srikar T
|

Updated on: Jan 31, 2024 | 7:15 PM

Share

అమరావతి, జనవరి 31: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన ఈ మంత్రివర్గ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ క్యాబినెట్ భేటి ఆసక్తిని సంతరించుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఫిబ్రవరి 16 న వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 500 జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న గ్రామ పంచాయతీలకు గ్రేడ్ – 3 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. DSC – 2024 ద్వారా 6100 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు.

డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకూ 2,13,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గణాంకాలను వెలువరించారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 2,20,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. జపాన్,దక్షిణ కొరియాలో మాత్రమే ఉన్న IB విద్యను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. SIPB ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పలు సంస్థలకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జాతర ఉండనున్నట్లు మంత్రి మాటల్లో అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..