మంత్రి రోజా Vs టీడీపీ నేత లోకేష్.. ఎవరూ తగ్గడం లేదు.. మాటలతోనే యుద్ధం చేస్తున్నారు.. హైవోల్టేజ్ డైలాగ్స్తో ఓ రేంజ్లో హీటెక్కిస్తున్నారు. లోకేష్ విమర్శలు.. రోజా కౌంటర్లు.. మామూలుగా లేదు మంట.! డైలీ సీరియల్లా సాగిపోతోంది డైలాగ్ వార్..! ఇప్పుడు లేటస్ట్గా సీజన్-2 స్టార్ట్ అయింది. లోకేష్పై మళ్లీ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు మంత్రి రోజా.. తనదైన శైలిలో విసుర్లు విసిరారు..పంచ్ల వర్షం కురిపించారు. లోకేష్కు ఏ రకం చీర కావాలో చెబితే పంపిస్తానంటూ రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆస్తుల విషయంలోనూ లోకేష్.. రోజా మధ్య డైలాగ్ వార్ నడిచింది. CBI ఎంక్వైరీకి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు రోజా.. నువ్వొకటంటే, నేను అంతకుమించి అంటానంటూ కౌంటర్లు, రీకౌంటర్లతో రాజకీయాలు మరింత రక్తికట్టిస్తున్నాయి.
గురువారం నగరికి వచ్చిన రోజా.. లోకేష్పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నా ఇంటి ముందు గాజులు పగలగొట్టించడానికి లోకేష్కి ఎంత ధైర్యమంటూ నిప్పులు చెరిగారు. చీరచీర అంటోన్న లోకేష్.. ఏ కలర్ చీర కావాలో చెబితే పంపిస్తానంటూ సెటైర్లు వేశారు. ‘‘లోకేష్కి ఏ కలర్ చీర కావాలో, ఏ టైపు కావాలో చెబితే పంపిస్తా.. బెనారస్ కావాలో, ఉప్పాడ కావాలో లోకేష్ చెప్పాలి.. నా ఇంటి ముందు గాజులు పగలగొట్టించడానికి లోకేష్కి ఎంత ధైర్యం.. లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని, ఓ శుంఠ.. నక్క వాతలు పెట్టుకున్నట్టు జగన్ను చూసి పాదయాత్రచేస్తే సీఎం అయిపోతావా! లోకేష్ యాత్రకు కర్నాటక, తమిళనాడు నుంచి అద్దె మనుషుల్ని తెచ్చుకుంటున్నారు’’ అంటూ కౌంటర్ ఇచ్చిన రోజా.. అవును, నా కుటుంబానికి నేను డైమండ్ పాపనే అంటూ టీడీపీ నేతలను విమర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోెసం..