
అమరావతి, జనవరి 7: బుధవారం (జనవరి 7వ తేదీన) ఉదయం 8.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో అంటే 4.8° ఉత్తర అక్షాంశం, 88.2° తూర్పు రేఖాంశం వద్ద అల్ప పీడనం వాయుగుండంగా బలపడింది. పోట్స్విల్లే (శ్రీలంక)కి తూర్పు-ఆగ్నేయంగా 740 కి.మీ., బట్టికలోవాకు తూర్పు ఆగ్నేయంగా 790 కి.మీ (శ్రీలంక), ట్రింకోమలీకి తూర్పు-ఆగ్నేయంగా 880 కి.మీ (శ్రీలంక) కారైకాల్ (తమిళనాడు)కి ఆగ్నేయంగా 1150 కి.మీ మరియు చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 1270 కి.మీ. (తమిళనాడు) దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఇది వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాత ప్రాంతానికి కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలిపింది.
కాగా రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండబోదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మీ ప్రాంతంలో వచ్చే 3 రోజుల వాతావరణం తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.