AP Weather: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలో 2 రోజుల భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

May 16, 2024 | 6:01 PM

వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రా వెదర్ రిపోర్ట్ చూద్దాం పదండి....

AP Weather: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలో 2 రోజుల భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
Andhra Weather Report
Follow us on

ద్రోణి ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శనివారం ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామ రాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. గురువారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం జిల్లా ఒంగోలులో 50.5మిమీ, నెల్లూరు జిల్లా ఓలేటివారిపాలెం 48.5మిమీ, నంద్యాల జిల్లా నందికొట్కూరులో 47.2మిమీ, నెల్లూరు లింగసముద్రం, గుడ్లూరులో 39.5మిమీ, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 27మిమీ, నెల్లూరు జిల్లా కలిగిరిలో 26.5మిమీ, ప్రకాశం మర్రిపూడిలో 24.5, అనకాపల్లి పాయకరావుపేటలో 23మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..