AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కిరాతకుడు..

Hudband killed wife in vizianagaram: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య.. భర్త పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అనంతరం

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కిరాతకుడు..
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2022 | 1:02 PM

Share

Hudband killed wife in vizianagaram: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య.. భర్త పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన విజయనగరం (Vizianagaram district) జిల్లా కొత్తవలస మండలం జోడిమెరక గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వివాహిత కనిపించకపోవడంతో వారం క్రితం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త నాగరాజు హత్యచేశాడని (Hudband killed wife ) పోలీసులు నిర్ధారించారు. గాలింపు అనంతరం పరారీలో నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. బాధితురాలిని భర్త.. పెట్రోల్‌ పోసి చంపాడు. ఈ క్రమంలో బాధితురాలు లక్ష్మీ మృతదేహాన్ని ఏపీ మోడల్ స్కూల్ వద్ద పోలీసులు గుర్తించారు. భర్తే.. చంపిన తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పేర్కొంటున్నారు. కాగా.. నిందితుడుని కఠినంగా శిక్షించాలని కొత్తవలసలో మహిళల ధర్నా నిర్వహిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నాడు.

Also Read:

Nandamuri Balakrishna: అవసరమైతే రాజీనామాకు సిద్ధం.. నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్..

Telangana Congress: ఠాగూర్‌ది ఆరంభశూరత్వమేనా?.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ..