Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఆమె ఫోన్ చేసి క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఆపై స్పైసీ వీడియో కాల్.. కట్ చేస్తే..

తీయని మాటలు - ఆపై అశ్లీల వీడియోకాల్... కక్కుర్తి పడ్డారో ఖేల్ ఖతం.. సత్యసాయి జిల్లాలో హనీట్రాప్ కేసును చేధించారు పోలీసులు. నలుగురు నిందితుల అరెస్టు చేశారు. హనీ ట్రాప్​లో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒక్కరే. కానీ తీగలాగితే డొంక కదులుతుంది.

Andhra News: ఆమె ఫోన్ చేసి క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఆపై స్పైసీ వీడియో కాల్.. కట్ చేస్తే..
Women (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2025 | 4:09 PM

మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి.. వాటిని రికార్డ్ చేసి, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్‌ను కటకటాల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు. మొత్తం నలుగురు నిందితుల అరెస్టు చేశారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేశ్​తో పాటు ఆ మహిళను అరెస్టు చేసి వారిని ఆదివారం రిమాండ్​కు​ తరలించారు.

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరుకు చెందిన ధనుంజయ్ అనే యువకుడు ఈ కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు. ధనుంజయ్ ట్రాప్‌లో చిక్కుకుని.. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లక్షా యాభై వేలు నిందితులకు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లేపాక్షి పోలీసులు.. ఎంక్వైరీ చేయగా డొంక కదిలింది. ధనుంజయ్ గ్యాంగ్ చాలామందిని మోసం చేసిందని గుర్తించారు. ఓ రెవిన్యూ సెక్రెటరీ నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహిళ సహా నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.  ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నట్లు లేపాక్షి మండలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.