ఫామ్‌హౌస్‌ చూపిస్తానంటూ తీసుకెళ్లాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ నిజాలు.!

నాగ్‌పూర్‌ టు రాజమండ్రి మధ్యలో హైదరాబాద్. కిడ్నాప్ కలకలం.. కథలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విషయం తెలిసి పోలీసులు ఫ్యూజులు..

ఫామ్‌హౌస్‌ చూపిస్తానంటూ తీసుకెళ్లాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి  షాకింగ్ నిజాలు.!
Farm House
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2021 | 2:52 PM

నాగ్‌పూర్‌ టు రాజమండ్రి మధ్యలో హైదరాబాద్. కిడ్నాప్ కలకలం.. దాని వెనుక గుప్తనిధుల వ్యవహారం. కథలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విషయం తెలిసి పోలీసులు ఫ్యూజులు ఎగిరిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కిడ్నాప్ కలకలం రేపింది. నాగపూర్ నుంచి రాజమండ్రికి వచ్చిన నలుగురు వ్యక్తులు ఒక హోటల్‌లో దిగారు. అయితే ఫామ్‌హౌస్‌ చూపిస్తా అంటూ ఆ నలుగురుని తోటకు తీసుకెళ్లాడు హోటల్ యజమాని. ఈ క్రమంలో 5 లక్షలు రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడట.

భయపడిపోయిన నాగపూర్ వాసులు రాజాసింగ్‌కు ఫోన్ చేయడంతో.. ఎమ్మెల్యే రాజమండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హోటల్ యజమాని నుంచి కాపాడారు. చివరకు వారు రాజానగరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. గుప్త నిధుల కోసం సాగిన బేరసారాలు తేడా రావడంతో విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. మొదట కిడ్నాప్ చేశారంటూ నాగ్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి రాజసింగ్‌కు సమాచారమిచ్చాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాధేయపాలెం తోటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. పరిచయం ఉన్న ద్వారక తిరుమలకు చెందిన వ్యక్తితో రాజానగరం ఫామ్ హౌస్‌ చేరుకున్నారు నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తులు. గుప్త నిధుల విషయంలో తేడా రావడంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గుప్తనిధుల నేపథ్యంలో రాజానగరం పోలీస్ స్టేషన్‌లో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ ముఠా ఎక్కడిది? అసలు నాగ్‌పూర్‌ నుంచి రాజమండ్రికి ఎందుకు వచ్చింది? వీరికి పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు? అసలు రాధేయపాలెం తోటల్లో ఏముంది? రెండు వర్గాల మధ్య సాగిన బేరసారాల కథేంటి అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

Also Read:

మరో మహామ్మరి కలకలం.. ఆంత్రాక్స్ లక్షణాలతో గొర్రెల మృతి.. జనాలు హడల్..

ఈ 5 విషయాలను ఎప్పుడూ మర్చిపోవద్దు.. లేదంటే ఏ సమస్యకి పరిష్కారం దొరకదు..

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు