AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అయ్యో భగవంతుడా.. తెల్లారితే పంక్షన్.. మృ‌త్యువుగా మారిన గ్రైండర్.. సెకన్లలోనే..

లూరు జిల్లాలో ఒక ఫంక్షన్ లో విషాదం చోటుచేసుకుంది. మేనమామ ఇంట్లో పంక్షన్ కు వెళ్లిన.. 11 ఏళ్ల పిల్లవాడికి విద్యుత్ షాక్ తగలి.. మృతి చెందాడు. శుభకార్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు.

Andhra: అయ్యో భగవంతుడా.. తెల్లారితే పంక్షన్.. మృ‌త్యువుగా మారిన గ్రైండర్.. సెకన్లలోనే..
Crime News
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 16, 2026 | 4:21 PM

Share

ఏలూరు: వేడుకలైనా.. శుభకార్యాలైనా..? ఎక్కడైనా.. పిల్లలదే కదా సరదా సందడి.. వారు లేకపోతే.. ఎలాంటి హడావుడి ఉండదు.. వంటశాలల నుంచి వేడుక మండపం వరకు కలియతిరిగుతూ.. తమ ఆటలతో హడావుడి చేస్తుంటారు. ఇక తొలి బంతిలో కూర్చుని భోజనం చేయడమంటే పిల్లలకు మరింత సరదాగా ఉంటుంది.. అయితే, ఏలూరు జిల్లాలో ఇలాంటి ఒక ఫంక్షన్ లో విషాదం చోటుచేసుకుంది. మేనమామ ఇంట్లో పంక్షన్ కు వెళ్లి.. 11 ఏళ్ల పిల్లవాడికి విద్యుత్ షాక్ తగలి.. మృతి చెందాడు. శుభకార్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో.. తల్లిదండ్రులు సహా అందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

అసలేం జరిగిందంటే..

జంగారెడ్డిగూడెం మండలం రామానుజపురానికి చెందిన చంద్రరావు, లలిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి చిన్న కొడుకు సుశాంత్ ఆరవ క్లాస్ చావుతున్నాడు. వాళ్ల మామయ్య మధు ఇంట్లో ఫంక్షన్ కోసం వెళ్ళాడు. ఫంక్షన్ కోసం.. వంటవాళ్ళు అందరూ హడావుడిగా ఎవరి పనుల్లో వాళ్ళు వున్నారు. అదే సమయంలో మసాలా రుబ్బడానికి గ్రైండర్ ను కూడా సిద్ధం చేసారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన సుశాంత్ పొరపాటున గ్రైండర్ వైర్ ను పట్టుకున్నాడు. అది కట్ అయి ఉండటంతో విద్యుత్ ప్రవహించి సుశాంత్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.. సుశాంత్ ను గమనించిన బంధువులు వెంటనే అతడిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే సుశాంత్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇంటినిండా బంధువులు, తెల్లవారితే సుశాంత్ మావయ్య కూతురి ఫంక్షన్.. కానీ సుశాంత్ మృతితో బంధువర్గం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పండుగ వాతవారణం కనుమరుగై రోదనలతో అందరూ తమగుండేలు పగిలేలా రోదించారు. ఒక చిన్న ఏమరపాటు, నిర్లక్ష్యం ఒక చిన్న పిల్లవాడి ప్రాణం తీసింది.

ఎలక్ట్రికల్ వర్కర్స్, ఫ్లంబర్స్, కార్పెంటర్స్ లో కొందరు తమ వద్ద ఉన్న ఎలక్ట్రికల్ వస్తువల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. తెగిపోయిన వాటికి పడే పదే ప్లాస్టర్ వేస్తుంటారు. వర్క్ చేసే సమయంలో, తరలించే సమయంలో అవి విడిపోవటం లూజ్ గా ఉండటం జరుగుతుంది. అయితే ఇది గమనించకపోతే ఇలాంటి ఘటనలే జరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్రైండర్ వల్ల ఆ పిల్లాడి ప్రాణం పోయింది.. అసలేం జరిగిందంటే..
గ్రైండర్ వల్ల ఆ పిల్లాడి ప్రాణం పోయింది.. అసలేం జరిగిందంటే..
అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం
అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన
రంగారెడ్డి రోడ్డు ప్రమాదం: హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
రంగారెడ్డి రోడ్డు ప్రమాదం: హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
చూపుడు వేలు పొడవు.. మీ గురించి ఏమి చెబుతుందో తెలుసా?
చూపుడు వేలు పొడవు.. మీ గురించి ఏమి చెబుతుందో తెలుసా?
క్యూట్ క్యూట్ ఫొటోలతో మతిపోగొడుతున్న కృతి శెట్టి..
క్యూట్ క్యూట్ ఫొటోలతో మతిపోగొడుతున్న కృతి శెట్టి..
రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!
రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!
సూర్య గ్రహణం ఎఫెక్ట్ .. ఈ రాశుల వారికి అడుగడుగునా సమస్యలే!
సూర్య గ్రహణం ఎఫెక్ట్ .. ఈ రాశుల వారికి అడుగడుగునా సమస్యలే!
8 ఏళ్లుగా సినిమాలకు దూరం.. ఈ హీరోయిన్ ఆస్తి రూ. 700 కోట్లకు పైనే
8 ఏళ్లుగా సినిమాలకు దూరం.. ఈ హీరోయిన్ ఆస్తి రూ. 700 కోట్లకు పైనే
మీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తోందా.. ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు..
మీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తోందా.. ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు..