AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: తీవ్ర విషాదం.. వర్షపు నీటిలో కొట్టుకుపోయిన బాలిక.. కొనసాగుతున్న గాలింపు!

అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఎడతెలిరి లేకుండా కురుస్తున్న వర్షాలతో నేపథ్యంలో స్కూల్‌ విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు ఆటో ఉన్న ఆరుగురు విద్యార్థులను రక్షించారు.

Andhra News: తీవ్ర విషాదం.. వర్షపు నీటిలో కొట్టుకుపోయిన బాలిక.. కొనసాగుతున్న గాలింపు!
Andhra Pradesh News
Anand T
|

Updated on: Sep 19, 2025 | 10:59 PM

Share

గత 24 గంటలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్యల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అయితే ఈ క్రమంతో శుక్రవారం సాయంత్రం రాయచోటిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్‌ విద్యార్థులతో వస్తున్న ఒక ఆటో వర్షపు నీటిలో మునిగిపోయింది.దీంతో ఆటోలో ఉన్న విద్యార్థులు, ఆటో డ్రైవర్‌ కాపాడామని కేకలు వేశారు. అది గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

నీటిలో చిక్కుకున్న ఆటలో ఉన్న ఆరుగురు విద్యార్థులను సురక్షితంగా కాపాడి పైకి తీసుకొచ్చారు. కానీ ప్రమాదవశాత్తు ఒక ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం సమీపం ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.q