Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra Celebrations: నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు.. అమ్మవారు తొమ్మిది అవతారాల్లో దర్శనం

Dussehra Celebrations: ఆలయాలు దసరా ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి అక్టోబర్‌ 5 వరకు జరిగే నవరాత్రులకు ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. ఇంద్రకీలాద్రిపై..

Dussehra Celebrations: నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు.. అమ్మవారు తొమ్మిది అవతారాల్లో దర్శనం
Dussehra Celebrations
Follow us
Subhash Goud

|

Updated on: Sep 26, 2022 | 7:40 AM

Dussehra Celebrations: ఆలయాలు దసరా ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి అక్టోబర్‌ 5 వరకు జరిగే నవరాత్రులకు ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణకు అంతా సిద్దం చేశారు. అటు.. శ్రీశైలం మల్లన్న ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉత్సవాలకు రేడీ అయింది. దసరా అంటేనే ఆయుధ పూజలు, అమ్మవారి అలంకారాలు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు అమ్మవారిని ఘనంగా కొలుస్తారు. దేశ వ్యాప్తంగా జరిగే దసరా ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. నేటి నుంచి అక్టోబర్‌ 5 వరకు 10 అవతారాలలో జగన్మాత భక్తులకు దర్శనమిస్తుంది. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. రెండవ రోజు రేపు శ్రీ బాలాత్రిపుర సుందరీగా, 28న మూడోవ రోజు గాయత్రీ దేవి, 29న నాలుగో రోజు శ్రీ అన్నపూర్ణ దేవి, 30న ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, అక్టోబర్‌ ఒకటిన ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి, రెండున ఏడవ రోజు శ్రీ సరస్వతు దేవి, మూడున 8వ రోజు శ్రీ దుర్గా దేవి, 4న 9వ రోజు శ్రీ మహిషాసురమర్ధిని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇక ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.

అటు శ్రీశైలం మహాక్షేత్రం కూడా దసరా మహోత్సవాలకు విద్యుత్‌ దీపాలతో ముస్తాబయింది. ఆలయాల పరిసరాలతో పాటు, గోపురాలను సర్వాంగ సుందరంగా మార్చారు. స్వామి అమ్మవారు వాహనసేవలో గ్రామోత్సవంగా విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మాడవీధులు, రధశాలను రంగు రంగుల లైట్స్‌తో రంగుల మయంగా మార్చారు. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇవాళ స్వామి అమ్మవార్ల యాగశాల ప్రవేశం జరుగుతుంది.

మరో వైపు సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయంలో కూడా దసరా ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు అమ్మవారికి పట్టు వస్ర్తాల సమర్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. అమ్మవారు తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఆలయాల అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి