AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badvel By Election: పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ..

పోరుమామిళ్ల రంగసముద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది...

Badvel By Election: పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ..
Kamalamma
Srinivas Chekkilla
|

Updated on: Oct 30, 2021 | 8:28 AM

Share

పోరుమామిళ్ల రంగసముద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అధికారులు 77A బూత్‎లో 20 నిమిషాలు ఆలస్యంగా ఓటర్లను అనుమతించారు. బద్వేల్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 221 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ ఉపఎన్నిక పోలింగ్‎కు 3000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది.

బద్వేల్‌ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,16,139 ఓటర్లు ఉన్నారు. అందులో 1,07,340 మహిళలు ఉండగా.. 1,08,799 పురుషులు ఉన్నారు. ఇక్కడ 914 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 7(బద్వేలు, కలసపాడు, బి.కోడూరు, ఎస్‌.ఎ. కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, ఆల్టూరు) మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ 6 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 3 సార్లు విజయం సాధించారు.

Read Also.. Badvel Election Bypoll: బద్వేల్ ఎన్నికలకు వరుణుడి ఎఫెక్ట్.. తీవ్ర ఇబ్బంది పడుతున్న పోలింగ్ సిబ్బంది..