AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ‘నాకు ప్రాణబిక్ష పెట్టింది వేంకటేశ్వర స్వామి’.. ఇస్కాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు..

రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు.

Watch Video: 'నాకు ప్రాణబిక్ష పెట్టింది వేంకటేశ్వర స్వామి'.. ఇస్కాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు..
Cm Chandrababu
Srikar T
|

Updated on: Jul 13, 2024 | 11:30 AM

Share

రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్‌, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

ప్రభుత్వంతోపాటు ఇలాంటి స్వచ్చంద సంస్థల సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామన్నారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశ్యంతోనే తిరుమల వెంకటేశ్వరస్వామి తనను కాపాడారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను నమ్మేదేవుడు, ప్రార్థించే దేవుడు వేంకటేశ్వర స్వామి అని మరోసారి తెలిపారు. 2003లో తనపై 23 క్లైమోర్ మైన్స్ బాంబు బ్లాస్ట్ చేయాలని ప్లాన్  చేశారు. అప్పుడు తన ప్రాణాలను కాపాడింది తిరుమల వేంకటేశ్వరుడని గతాన్ని గుర్తు చేశారు. ఆది ఒక మిస్టరీ అని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..