YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం.. అదేంటంటే..
ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియలో సీఐబీ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై నిన్హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్..

ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియలో సీఐబీ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై నిన్హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. వివేకానందరెడ్డి లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేస్తోంది. హత్యస్థలిలో లభించిన లేఖను 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్ఎస్ఎల్కు పంపింది సీబీఐ. అయితే ఒత్తిడిలో వైఎస్ వివేకా రాసిన లేఖగా ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ తేల్చింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ను సీబీఐ కోరింది.
లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలన్న సీఎఫ్ఎస్ఎల్.. నిన్హైడ్రేట్ పరీక్ష ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్ఎస్ఎల్ తెలిపింది. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున కోర్టును ఆశ్రయించింది సీబీఐ. లేఖపై నిన్హైడ్రేట్ పరీక్ష జరిపేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరింది సీబీఐ. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్ను అనుమతించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే సీబీఐ పిటిషన్పై నిందితుల స్పందన కోరింది సీబీఐ న్యాయస్థానం. సీబీఐ పిటిషన్పై జూన్ 2న విచారణ జరగనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి