AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో తొలి విమానానికి వాటర్‌ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. 2,200 మంది భూదాత రైతుల్లో తొలిరోజు 165 మందికి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించారు.

భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..
Bhogapuram Airport
Gunneswara Rao
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 8:54 PM

Share

భోగాపురంలో తొలి ఫ్లైట్ సోమవారం ఉదయం 6.45కి ల్యాండ్ అయ్యింది. ల్యాండైన తొలి ఫ్లైట్‌కి వాటర్ సెల్యూట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీస్ దే ఫస్ట్ ఫ్లైట్. ఇందులో వచ్చిన ప్రయాణికులకు ఘన స్వాగతం లభించింది. వారికి ఏటికొప్పాక బొమ్మలను గిఫ్ట్‌గా ఇవ్వడంతో.. ఆ ప్రయాణికులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో చివరి సర్వీస్ ఆదివారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఢిల్లీకి వెళ్లింది. ఇక ఈ ఎయిర్ పోర్ట్ నుంచి లాస్ట్ సర్వీస్ వెళ్లడంతో అక్కడ సెండాఫ్ వేడుకలు చేసుకున్నారు. అక్కడ పనిచేసే వారందరికీ APATA సభ్యులు స్వీట్ ప్యాకెట్స్ ఇచ్చారు. సో.. ఒక్క రోజులోనే.. విమాన సర్వీసులు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కొద్ది రోజుల కిందట ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఆ తరువాత సోమవారం నుంచి సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇక విశాఖ విమానాశ్రయం నుంచి పౌర విమాన సేవలకు అవకాశం లేనట్టే. అన్ని సర్వీసులూ భోగాపురం నుంచే ఆపరేట్ అవుతాయి. భోగాపురానికి వచ్చిన ఫ్లైట్ అయితే సోమవారం వచ్చింది కానీ.. భోగాపురం నుంచి వెళ్లిన ఫ్లైట్ సంగతి చూస్తే.. ఆదివారం అర్థరాత్రే.. సింగపూర్ కు వెళ్లింది. సో.. ఇక రాకపోకలు పూర్తిగా మొదలైనట్టే. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. ఈ ఎయిర్ పోర్టు కోసం భూములిచ్చిన రైతులు 2 వేల 200 మంది ఉన్నారు. వీరికి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి