AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asani Cyclone – Andhra Pradesh: దూసుకొస్తున్న ‘అసని’.. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు చేసిన వాతావరణ శాఖ..!

Asani Cyclone: బంగాళాఖాతంలో అసాని సైక్లోన్ కొనసాగుతోంది ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వస్తోంది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపునకు..

Asani Cyclone - Andhra Pradesh: దూసుకొస్తున్న ‘అసని’.. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు చేసిన వాతావరణ శాఖ..!
Asani Cyclone
Shiva Prajapati
|

Updated on: May 09, 2022 | 10:05 PM

Share

Asani Cyclone: బంగాళాఖాతంలో అసాని సైక్లోన్ కొనసాగుతోంది ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వస్తోంది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపునకు దూసుకొస్తోంది. రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర తీరంకి సమీపంగా వచ్చి ఆ తర్వాత దిశను మార్చుకోను౦ది. 2022లో మొదటిగా తుఫాను అసని ఏపీలో ఉత్తరాంధ్ర తీరంపై ప్రభావం చూపిస్తోంది. రేపు తీవ్ర తుఫానుగా మారి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా హెచ్చరికలు జారీ చేశారు.

అసని తీవ్ర తుపాను అని చెప్పారు. రేపు తుపానుగా బలహీనపడుతుందన్నారు. తుపానుగా మారి వెనక్కి వెళ్లిపోతుందన్నారు. ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి ఒడిస్సా తీరం నుంచి వాయువ్య బంగాళాఖాతం వైపు మళ్ళుతుందని స్టెల్లా వెల్లడించారు. తుపానుగా మారాక తీరం వెంబడి 49 నుంచి 59 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని చెప్పారు. రైతులు పంటలు వేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

పిడుగులతో మృతి.. ఇదిలాఉంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మ౦డల౦లోని గాలికొండ పంచాయతీ పరిధి లోని సట్రాపల్లి గ్రామం పిడుగుల థాటికి 12 ఆవులు, దుక్కిటెడ్లు మృతి చెందాయి. సట్రాపల్లికి చెందిన ఆవులు, ఎడ్లను గిరిజనులు మేతకు కొండపైకి తోలుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి మధ్యాహ్నం భోజనంకు వచ్చారు. మధ్యాహ్నం నుంచి ఈప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడటంతో బాటు కొండపై పిడుగులు పడటంతో పిడుగుల దాటికి 12 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. వర్షం తగ్గిన తరువాత గిరిజనులు కొండపైకి వెళ్ళి పరిశీలించగా ఆవులు, ఎడ్లు మృతి చెందినట్లు గుర్తించారు. గ్రామానికి చెందిన గెమ్మేలి చంద్రరావు. గెమ్మేలి త్రినాధ్, బోడపాట్ల అప్పారావు, కొర్రా బలరామ్, కొర్రా పోతురాజు అనే గిరి జనులకు చెందిన పశువులు మృతి చెందినట్లు గుర్తించారు.

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై