AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ఏపీకి వాయుగండం ముప్పు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Rain Alert: ఏపీకి వాయుగండం ముప్పు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2025 | 7:28 AM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయి ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

శుక్రవారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నిన్న గురువారం సాయంత్రం 5 గంటల నాటికి పల్నాడు జిల్లా రెంటపాళ్ళలో 47.5మిమీ, గరికపాడులో 41, సత్తెనపల్లిలో 34.5మిమీ వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో వాతావరణం ఇలా..

కాగా.. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి.. ఛత్తీస్‌గఢ్, ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా నల్లగొండ లలో 37, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 29.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..