AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: చూశారా ఈ దృశ్యం.. ఏపీ రాజకీయాల్లో అత్యంత రేర్ సీన్..

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నేత నారా లోకేష్ వైఎస్సార్ కుటుంబానికి చెందిన విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా.. మరోవైపు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

Andhra: చూశారా ఈ దృశ్యం.. ఏపీ రాజకీయాల్లో అత్యంత రేర్ సీన్..
Andhra Pradesh Politics
Ram Naramaneni
|

Updated on: Apr 19, 2026 | 1:18 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా పరస్పరం విమర్శలు చేసుకునే అధికార, విపక్ష నేతలు.. ఈసారి సోషల్ మీడియా వేదికగా పరస్పరం శుభాకాంక్షలు, పరామర్శలు తెలియజేస్తూ భిన్నమైన సందేశం ఇస్తున్నారు.

ఒకవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. వైఎస్సార్ కుటుంబానికి చెందిన వైఎస్ విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. సాధారణంగా రాజకీయ విభేదాలు ఉన్నా.. ఈ శుభాకాంక్షలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయంగా విభిన్న ధోరణులు ఉన్నా.. వ్యక్తిగత ఆరోగ్యంపై పరామర్శించడం సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

ఇటీవల రాజకీయాల్లో పదునైన విమర్శలు, ఆరోపణలు పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి ట్వీట్లు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. విభేదాలు ఉన్నా.. వ్యక్తిగత అంశాల్లో పరస్పరం గౌరవం చూపడం రాజకీయాల్లో అరుదుగా కనిపించే పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో ఇలాంటి సీన్స్ చాలా అరుదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి.. సోషల్ మీడియా వేదికగా వెలువడిన ఈ ట్వీట్లు రాజకీయాల్లో మరో కోణాన్ని చూపించాయి. విభేదాల మధ్య కూడా మానవీయ విలువలు నిలుస్తున్నాయనే సంకేతాన్ని ఇవి ఇస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Follow Us