AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP High Court: చింతామణి నాటక నిషేధంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. కీలక కామెంట్స్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం బాగా ఫేమస్. దాదాపు 100 ఏళ్ల నుంచి ఈ నాటకం వేస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ నాటకంలోని ఓ పాత్రపై ఆర్య వైశ్యలకు అభ్యంతరాలున్నాయి.

AP High Court: చింతామణి నాటక నిషేధంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. కీలక కామెంట్స్
Ap High Court
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2022 | 1:58 PM

Share

Chintamani Natakam Ban: చింతామణి నాటక నిషేధంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వేళ పాత్రపై ఏదైనా అభ్యంతరం ఉంటే దాన్ని తొలగించాలి గానీ, నాటకాన్నే ఎలా నిషేధిస్తారని ప్రశ్నించింది దర్మాసనం. చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా? అని కూడా ప్రశ్నించింది గౌరవ హైకోర్టు. చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదన్నారు న్యాయవాదులు. పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేదిస్తారని ప్రశ్నించింది ధర్మాసనం. అంతే కాదు ఆర్యవైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ విషయానికి సంబంధించి అధికారులు- కౌంటర్ దాఖలు చేయాలని కూడా సూచించింది ఏపీ హైకోర్ట్.  ఏపీలో చింతామణి నాటకం నిషేధంపై కళాకారులు(Stage Artists)భగ్గుమంటున్నారు. తప్పు ఏదైనా ఉంటే సరి దిద్దాల్సింది పోయి.. నాటకాన్ని నిషేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై హైకోర్టులో ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్‌(Arugu Trinath) పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఆర్టిస్టులు రోడ్డునపడ్డారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఈ పిటిషన్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. తాజా కామెంట్స్ చేసింది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం బాగా ఫేమస్. దాదాపు 100 ఏళ్ల నుంచి ఈ నాటకం వేస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ నాటకంలోని ఓ పాత్రపై ఆర్య వైశ్యలకు అభ్యంతరాలున్నాయి. ఈ నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై నిషేధం విధించాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా మంత్రి వెల్లంపల్లి చొరవతో.. ఏపీ సర్కార్ చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చింతామణి నాటక ప్రదర్శనను నిషేధంపై.. రఘురామ కృష్ణరాజు సైతం హైకోర్టుకు వెళ్లారు. ఈ నాటకాన్ని నిషేధిస్తూ.. గవర్నమెంట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చింతామణి నాటకంపై ఆధారపడి వేలాది మంది స్టేజ్ ఆర్టిస్టులు జీవనం సాగిస్తున్నారని.. ఈ నాటకం నిషేధించడం వల్ల వారందరూ జీవనోపాధి కోల్పోతున్నారని ఆయన కోర్టుకు విన్నవించారు.

Also Read: AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. స్పష్టం చేసిన కేంద్రం