పేరెంట్స్ కు సీఎం జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్…!
విద్యా సంస్కరణలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న సీఎం జగన్ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలోని ప్రైమరీ స్కూల్స్ లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ స్కూల్స్ను స్టార్ట్ చెయ్యాలని విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద 3,400 పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రీ స్కూల్స్కు అవసరమయ్యే సిలబస్ (పాఠాల) రూపకల్పనపైనా ఫోకస్ మొదలు పెట్టారు. నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు ప్రీ స్కూల్స్లో […]
విద్యా సంస్కరణలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న సీఎం జగన్ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలోని ప్రైమరీ స్కూల్స్ లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ స్కూల్స్ను స్టార్ట్ చెయ్యాలని విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద 3,400 పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రీ స్కూల్స్కు అవసరమయ్యే సిలబస్ (పాఠాల) రూపకల్పనపైనా ఫోకస్ మొదలు పెట్టారు. నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు ప్రీ స్కూల్స్లో అడ్మిషన్లు ఇస్తారు.
ఈ ప్రీ స్కూల్స్లో సంవత్సరం పాటు చదవడం, రాయడం వంటివి ప్రాక్టీస్ చేయిస్తారు. అలాగే పిల్లల్లో ఉన్న స్పెషల్ టాలెంట్స్ వెలికితీయడం, మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్ పై స్పెషల్ ఫోకస్ చేయిస్తారు. ఆ తర్వాత విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో చేరతారు. ఈ ప్రీ స్కూల్స్లో టీచర్లను కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకుంటారు. ఈ విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడంతో పాటూ విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందని భావిస్తున్నారు అధికారులు. తొలి విడతగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. స్టేట్ గవర్నమెంట్ అనుమతి ఇస్తే… మొత్తం అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.