AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: నేడు వాలంటీర్లకు వందనం.. పలువురిని సత్కరించనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి

వలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది వైసీపీ ప్రభుత్వం 'వాలంటీర్లకు వందనం' అనే కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టనున్నారు...

CM Jagan: నేడు వాలంటీర్లకు వందనం.. పలువురిని సత్కరించనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి
Ap Cm Jagan (file Photo)
Narender Vaitla
|

Updated on: May 19, 2023 | 6:35 AM

Share

వలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది వైసీపీ ప్రభుత్వం ‘వాలంటీర్లకు వందనం’ అనే కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సేవా భావంతో సేవలందిస్తున్న వలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రోత్సాహకంగా సత్కారం చేస్తూ వస్తోంది.

అవినీతికి తావు లేకుండా, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో వలంటీర్ల పని తీరే ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు. నేడు అందిస్తున్న ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి వరకు వలంటీర్లకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొత్తం రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం ఖర్చుచేసింది.

మొత్తం మూడు కేటగిరీల్లో పురస్కారాలు..

మే 19వ తేదీ నంఉచి అన్ని నియోజకవర్గాల్లో వలంటీర్లకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. ఇందులో భాగంగా వలంటీర్లు అందిస్తున్న సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. నియోజకవర్గంలో అత్యత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర పేరుతో.. సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.30,000 నగదు బహుమతి అందించనున్నారు. ఇక సేవా రత్న పేరుతో ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున టాప్‌–1 ర్యాంకు సాధించిన వలంటీర్లకు సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.20,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు. సేవా మిత్ర ద్వారా ఎలాంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన వలంటీర్లకు సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.10,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు