ప్రధాని తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అత్యంత ప్రశంసనీయం.. మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం జగన్‌..

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే

ప్రధాని తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌  అత్యంత ప్రశంసనీయం.. మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం జగన్‌..
Follow us

|

Updated on: Dec 22, 2021 | 9:56 PM

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. కాగా క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు వైఎస్‌ జగన్‌. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న చర్యల్లో ‘ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌’ అత్యంత ప్రశసంసనీయమైనదని ప్రశంసించారు . సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శాస్త్రసాంకేతిక రంగాల్లో గడచిన 75 ఏళ్లలో దేశం సాధించిన ప్రగతిని గుర్తుచేసుకోవడానికి, ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అమృత్‌ మహోత్సవ్‌ వేదిక కల్పిస్తోందన్నారు.

మొత్తం 908 కార్యక్రమాలు నిర్వహించాం.. ‘స్వతంత్ర్య పోరాటయోధుల నిస్వార్థత, వారి స్ఫూర్తిని చూసి మనమంతా గర్వపడాలి. అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా వారిని గుర్తుకు తెచ్చుకోవాలి. గౌరవించుకోవాలి. వారికి సెల్యూట్‌ చేయాలి. ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌ కారణంగా ఏపీకి చెందిన స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించుకునే అవకాశం నాకు కలిగింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్యకుమార్తె సీతా మహాలక్ష్మిగారిని వారి స్వగ్రామంలో కలుసుకున్నాను. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం ప్రస్తుతం బాపు మ్యూజియంలో ఉంది. మా ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈ మ్యూజియంను బాగుచేసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ప్రకాశం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, వావిలాల గోపాలకృష్ణయ్య తదితరుల సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ మొత్తం 908 కార్యక్రమాలు నిర్వహించాం. నిస్వార్థపరులైన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకోవడమే కాదు, వారి జీవితాలనుంచి ఈ తరం యువకులు స్ఫూర్తిని పొందుతున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడంద్వారా వారిలో దేశభక్తిని నింపుతున్నాం ‘

ప్రధాని చర్యలు ప్రశంసనీయం.. ‘గడచిన కాలంలో మనదేశం నడిచిన మార్గాన్ని మరోసారి అవలోకనం చేసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశాన్ని కల్పించింది. గడచిన 75 ఏళ్లలో ముఖ్యంగా ఈ ఏడున్నరేళ్లలో మన దేశం చాలా ప్రగతిని సాధించింది. రియల్‌ జీడీపీ 1950–51లో రూ.2.94 లక్షల కోట్లు ఉంటే, 2019–20 నాటికి రూ. 145.69 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్న మార్గంలో అనేక అవకాశాలూ, సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశ సమర్థతను చాటడానికి సుస్థిర ప్రగతి సాధించడం, ఆర్థిక అసమానతలను తొలగించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. దేశ ఆర్థిక పురోగతి ద్వారా ఇప్పుడున్నవారు ప్రస్తుతం తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే భవిష్యత్తు తరాలు కూడా తమన అసరాలను తీర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తుంది. గడచిన 15 ఏళ్లుగా దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 1,27,423 మెగావాట్ల నుంచి 3,84,116 మెగావాట్లకు పెరిగింది. ముఖ్యంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 84,982 మెగావాట్ల నుంచి 2,34,058 మెగావాట్లకు పెరిగింది. దీనివల్ల కాలుష్యకారక వాయువులు వెలువడుతున్నాయి. ఇది భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరం. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిని క్రమంగా తొలగించి ఆస్థానంలో సహజ వనరులనుంచి విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత ఉంది. సహజ వనరులనుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను స్టోరేజ్‌ చేసుకునే విషయంలో పరిష్కారాలను సత్వరం సాధించాల్సి ఉంది. కార్బన్‌ న్యూట్రాలిటీని సాధించడంతోపాటు అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయడంలో ఇది అత్యంత అవసరం. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా స్వచ్ఛ విద్యుత్‌ను ఉత్పత్తిచేసే విషయంలో ఒకే సూర్యుడు (వన్‌ సన్‌), ఒకే ప్రపంచం (వన్‌ వరల్డ్‌), ఒకే గ్రిడ్‌ (వన్‌ గ్రిడ్‌) దిశగా ప్రధాన మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి’

ఆర్థిక అసమానతలు తొలగించాలి.. ‘భౌగోళికంగా రెండు కాలమానాలున్న ప్రాంతాలమధ్య విద్యుత్‌ పంపిణీ ఉండాలి. ప్రస్తుతం ఇది ఒక కల కావొచ్చు. కాని మరొక వాస్తవ విషయం ఏంటంటే.. ఖండాల మధ్య డేటాను పంపడానికి ఇప్పటికే ఆప్టికల్‌ ఫైబర్‌నెట్‌ వ్యవస్థ ఉంది. ఇదే తరహాలో ఖండాలను కలుపుతూ పవర్‌ గ్రిడ్‌ అన్నది తీరని కల కాకూడదు. ఇక ఆర్థిక అసమానతలను తొలగించడంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి. గడచిన నాలుగు దశాబ్దాలుగా అర్థిక అసమానతలను రూపుమాపడంలో చాలా మంచి నిర్ణయాలు అమలు చేశారు. ఉచితంగా విద్య, ఆహార భద్రతలను చట్టబద్ధం చేశారు. ప్రధాని నాయకత్వంలో గ్రామాలను పెద్ద ఎత్తున విద్యుద్దీకరించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. కాని ఒక సమస్య నిరంతరం మనల్ని వెంటాడుతోంది. ఈ దేశంలో పేదరికాన్ని రూపు మాపడానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ప్రగతి సరిపోవడంలేదు. ప్రంచంలో అసమానతలపై తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం జాతీయ ఆదాయంలో 57శాతం 10శాతమంది చేతిలోనూ, 22 శాతం 1 శాతం చేతిలో ఉందని చెప్తోంది. ఆర్థిక అసమానతల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రుణభారాన్ని పెంచుతాయి, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అత్యంత తీవ్రమైన ఈ సమస్య పట్ల విధాన రూపకర్తలమైన మనం అంతా దృష్టిసారించాల్సి ఉంది. సమగ్ర ఆర్థికాభివృద్ధి దిశగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని తొలగించాలి’ అని జగన్‌ ప్రసంగించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు