AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణతో సహా రూ.1,17 వేల కోట్ల ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అధ్యక్షతన అమరావతిలో శుక్రవారం (అక్టోబర్ 10) జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. SIPB క్లీన్‌ ఎనర్జీ, టూరిజం, ఐటీ రంగాలలో ప్రతిపాదించిన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డాటా సెంటర్ తో సహా రూ.1,17 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణతో సహా రూ.1,17 వేల కోట్ల ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం
Ap Cabinet
Balaraju Goud
|

Updated on: Oct 10, 2025 | 6:39 PM

Share

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అధ్యక్షతన అమరావతిలో శుక్రవారం (అక్టోబర్ 10) జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. SIPB క్లీన్‌ ఎనర్జీ, టూరిజం, ఐటీ రంగాలలో ప్రతిపాదించిన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డాటా సెంటర్ తో సహా రూ.1,17 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ మెగా డేటా సెంటర్, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు, ఉద్యోగుల డీఏ పెంపు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్‌భవన్‌ నిర్మాణానికి ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణతోపాటు పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మారనున్నాయి. ఆదాయాన్ని బట్టి పంచాయతీలను గ్రేడ్లుగా విభజన చేయనున్నారు. అలాగే పంచాయతీ సెక్రెటరీలను, పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్ సమావేశంలో మొత్తం 26 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ వచ్చే మూడేళ్లలో ఎలక్ట్రిక్ గా మార్చాలని వచ్చిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థల ఏర్పాటు కోసం మంత్రులు ప్రత్యేకించి బాధ్యత తీసుకోవాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..