AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Purandeswari: ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా.. ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన పురంధేశ్వరి

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆమె నడ్డా నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు.

Purandeswari: ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా.. ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన పురంధేశ్వరి
Purandeswari, Jp Nadda
Basha Shek
|

Updated on: Jul 06, 2023 | 3:46 PM

Share

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆమె నడ్డా నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం తన పై నమ్మకం ఉంచినందుకు నడ్డాకి కృతజ్ఞతలు తెలియజేశానంటూ ట్వీట్‌ చేశారు. అలాగే ఏపీలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నిబద్ధతో పనిచేసి ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను. ఏపీ, ఆంధ్రుల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు పురంధేశ్వరి. కాగా సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమిస్తూ బీజేపీ అధిష్టానం మంగళవారం (జూన్‌ 4) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఏపీలో గత మూడేళ్లుగా సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. అయితే ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే వీర్రాజు హయాంలోనే కన్నా లక్ష్మీ నారాయణ వంటి కీలక నాయకులు పార్టీని వీడారు. ఈక్రమంలోనే సోము వీర్రాజు స్థానంలో పురంధేశ్వరని బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ అధిష్ఠానం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు