AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR Pension: తెల్లవారుజాము నుంచే ఇంటి వద్దకు వలంటీర్లు.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ షురూ

ప్రతి పేదవాడు ఆకలితో ఇబ్బందులు పడకుండా కడుపు నింపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

YSR Pension: తెల్లవారుజాము నుంచే ఇంటి వద్దకు వలంటీర్లు.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ షురూ
Peddireddy Ramchandra Reddy
Balaraju Goud
|

Updated on: Dec 01, 2021 | 9:56 AM

Share

AP YSR Pension Kanuka Distribution: ప్రతి పేదవాడు ఆకలితో ఇబ్బందులు పడకుండా కడుపు నింపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే వైఎస్సార్‌ సామాజిక పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, దీర్ఘకాలిక రోగులకు పెన్షన్లు పంపిణీ ఒక మహా యజ్ఞంలా సాగుతోంది. పొద్దుపొడవక ముందే మా ఇంటి తలుపు తట్టి మరీ అందిస్తున్నారు వలంటీర్లు. ఒకటవ తారీఖున అందిస్తున్న పెన్షన్లు ఒక పెద్దకొడుకు కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఈ జన్మంతా రుణపడి ఉంటామని లబ్ధిదారులు అంటున్నారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 60,50,650 మంది లబ్ధిదారులకు పెన్షన్‌ అందించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు కోసం రూ.1,411.42 కోట్ల మొత్తాన్ని మంగళవారం సాయంత్రానికే గ్రామ, వార్డు సచివాలయ ఖాతాల్లో జమ చేశామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్‌ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. 5 రోజుల వ్యవధిలో నూరుశాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. పెన్షన్ కానుక పంపిణీని డిఅర్డీఎ కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.

Read Also…  AP CM YS Jagan: రేపు మూడు జిల్లాల పర్యటనకు సీఎం జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన!