AP CM YS Jagan: రేపు మూడు జిల్లాల పర్యటనకు సీఎం జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన!

వరద ప్రభావంతో అతలా కుతలమైన మూడు జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది.

AP CM YS Jagan: రేపు మూడు జిల్లాల పర్యటనకు సీఎం జగన్..  వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన!
Follow us

|

Updated on: Dec 01, 2021 | 9:38 AM

AP CM YS Jagan district tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద ధాటికి ముఖ్యంగా దక్షిణాంధ్ర, రాయలసీమ అల్లాడిపోయింది. వరద ప్రభావంతో అతలా కుతలమైన మూడు జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 2,3 తేదీల్లో జగన్ తన సొంత జిల్లా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌కు పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది.

రెండో తేదీన గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయలదేరి గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో రాజంపేట మండలం మదనపల్లి చేరుకుంటారు. పులపాతూరు గ్రామంలో సీఎం పర్యటిస్తారు. భారీగా దెబ్బ తిన్న గ్రామాన్ని సందర్శించి..బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. సహాయ శిబిరాలను సందర్శించి..గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి మందపల్లి గ్రామానికి వెళ్లనున్నారు. ఆ తరువాత వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డాం ప్రాంతాన్ని సీఎం స్వయంగా పరిశీలిస్తారు.

☞మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి రేణిగుంట విమానశ్రయానికి చేరుకుంటారు. ☞3.40కు రోడ్డుమార్గాన బయలుదేరి 3.55 గంటలకు రేణిగుంట మండలంలోని వేదాలచెరువు ఎస్టీ కాలనీకి చేరుకుని కాలనీవాసులతో మాట్లాడతారు. ☞సాయంత్రం 4.30కు బయలుదేరి 4.40 గంటలకు ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేటకు చేరుకుని వరద నష్టాలను పరిశీలిస్తారు. ☞4.55కు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు తిరుచానూరు–పాడిపేట క్రాస్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడతారు. ☞5.40 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని 7 గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో వరదలపై సమీక్షిస్తారు. ఆరోజు అక్కడే బసచేస్తారు. ☞3వ తేదీ ఉదయం 8.30కు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి 8.40 గంటలకు తిరుపతిలోని కృష్ణానగర్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడుతారు. ☞9.25 గంటలకు బయలుదేరి ఆటోనగర్‌కు చేరుకుని బాధితుల సమస్యలు తెలుసుకుంటారు. ☞10.20 బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, 10.30కి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు పయనమవుతారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు: 02.12.2021 & 03.12.2021 Hon’ble CM’s Schedule. Read Also…. NBCC Recruitment: నవరత్న సంస్థ ఎన్‌బీసీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..