AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

పనులు వేగంగా పూర్తయ్యాయ్.. ముహూర్తం కూడా ఖరారైంది.. ఇంకేముంది.. విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల అయింది.

YS Jagan: ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..
Ys Jagan
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Oct 11, 2023 | 9:58 PM

Share

పనులు వేగంగా పూర్తయ్యాయ్.. ముహూర్తం కూడా ఖరారైంది.. ఇంకేముంది.. విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల అయింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఏర్పాటైన జీవోలో పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. సామరస్యపూర్వక.. సమతుల్య వృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

G.O. Rt. నెంబర్ 2015 లో సీఎస్ జవహర్ రెడ్డి ఏం పేర్కొన్నారంటే..

రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు.. ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, తీవ్రత, కనెక్టివిటీ పరంగా తక్కువ సామాజిక-ఆర్థిక అభివృద్ధి సూచికలను ప్రదర్శిస్తున్నాయనీ, ఈ ప్రాంతంలో గిరిజన జనభా ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. భారత ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో నాలుగు వామపక్ష తీవ్రవాద (LWE) ప్రభావిత జిల్లాలుగా గుర్తించబడ్డాయనీ గుర్తు చేసిన ప్రభుత్వం.. ఇంకా పేర్కొన్న ప్రాంతంలోని కొన్ని జిల్లాలు బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ పరిధిలోకి వస్తాయని వివరించారు.

నీతి అయోగ్ గుర్తించిన మూడు ఆకాంక్షాత్మక జిల్లాల్లో రెండు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని చారిత్రక వెనుకబాటుతనానికి సంబంధించిన సందర్భాన్ని సముచితంగా అంగీకరిస్తూ, ఉత్తర కోస్తా ప్రాంతానికి అంటే రాష్ట్రంలోని ఉత్తరాంధ్రకు ప్రోత్సాహకాలు, ప్రత్యేక అభివృద్ధిని అందిస్తుందనీ వివరించారు. అందువల్ల, ఉత్తర కోస్తా జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని జీవోలో స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక శ్రద్ద అవసరం..

ఈ నేపధ్యంలో ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులు, ప్రత్యేక అధికారులు ఉత్తర కోస్తా జిల్లాలను క్రమం తప్పకుండా సందర్శించాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ఆదేశాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ పర్యవేక్షణ కోసం ఆదేశాలు జారీ చేశామని, జిల్లా సమీక్షా సమావేశాలలో తీసుకున్న తీర్మానాలు.. క్షేత్ర సందర్శనలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక అవసరాలు, అభివృద్ధి గురించి తెలుసుకోవడం, పేర్కొన్న జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రాజెక్ట్ అమలు ట్రాకింగ్ మెకానిజంను అభివృద్ధి చేయాల్సి ఉందంటూ అధికారులను ఆదేశించారు. ఈ ప్రయోజనం కోసం, విశాఖపట్నం, పరిసర ప్రాంతాలలో రవాణా వసతి కోసం ఆయా శాఖలు తమ స్వంత ఏర్పాట్లు చేసుకోవచ్చని కూడా అందులో ఆదేశించారు.

సీఎంవో షిఫ్టింగ్

పైన పేర్కొన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తర కోస్తా జిల్లాలను సందర్శించి ఆ ప్రాంతంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాలను సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి అవకాశం ఉందని పేర్కొన్న ప్రభుత్వం.. కొన్ని సమయాల్లో ముఖ్యమంత్రి, వారు పేర్కొన్న జిల్లాల్లో పర్యటన, రాత్రి బస చేస్తున్నప్పుడు, సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరు కావాల్సి ఉంటుందని వివరించారు. విశాఖపట్నంలో శిబిరం, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, పర్యవేక్షణ కొరకు మంత్రులు, సీనియర్ అధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి, తీసుకున్న నిర్ణయాలను క్షేత్ర స్థాయి అధికారులకు తెలియజేయవలసిందిగా కోరారు. త్వరగా ముఖ్యమంత్రి కోసం క్యాంప్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయడం, సీనియర్ అధికారులు ఉండే విధంగా వారికి వసతి కల్పించడం అవసరమని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తర్వాత, పేర్కొన్న కార్యాలయాలకు తగిన రవాణా వసతిని గుర్తించడానికి కింది అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.. దీనిలో 1. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, MA & UD శాఖ, 2. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, 3. ప్రభుత్వ కార్యదర్శి సాధారణ పరిపాలనశాఖను నియమించింది.

ఈ కమిటీ ఈ విషయంలో తక్షణ చర్య తీసుకుంటుందని.. నివేదికలను ఎప్పటికప్పుడు సాధారణ పరిపాలన విభాగానికి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!