AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది స్పాట్ డెడ్..

Andhra Pradesh: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..
Car Accident
Shiva Prajapati
|

Updated on: Feb 06, 2022 | 7:52 PM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది స్పాట్ డెడ్ అయ్యారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన పెళ్లి బృందం కారులో వెళ్తున్నారు. అయితే, ఉరవకొండ మండలం సమీపంలో ఈ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు స్థానికులు, అధికారులు. మృతులంతా అనంతపురం టౌన్‌కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ లారీ అధిక స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:

Statue of Equality: సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న పవన్‌కల్యాణ్‌.. ఆయన మహాసంకల్పం వల్లే అంటూ..

India-Pak Ties: భారత్-పాక్ మధ్య రహస్య మంతనాలు జరుగుతున్నాయా? మోదీ పాక్‌ పర్యటనకు వెళతారా?..

Andhra Pradesh – JNTUA: జేఎన్‌టీయూఏలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్ విద్యార్థులపై వికృత చేష్టలకు పాల్పడుతూ..