AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: టీడీపీ అధినేత చంద్రబాబు సహా మరో ఇద్దరు టీడీపీ సీనియర్లకు ఈసీ నోటీసులు

ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేతలకు ఈసీ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. సీఎం జగన్‌పై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టడంపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో నోటీసులు జారీ చేసింది.

TDP: టీడీపీ అధినేత చంద్రబాబు సహా మరో ఇద్దరు టీడీపీ సీనియర్లకు ఈసీ నోటీసులు
Chandrababu
Ram Naramaneni
|

Updated on: Apr 05, 2024 | 7:43 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార వైసీపీ, కూటమి నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు విసురుకుంటూ.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయి ప్రసంగిస్తున్నారు. దాంతో.. ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. వైసీపీ నేతల కంప్లైంట్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌పై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టడంపై ఈ నెల 2న ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ నేత లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను సైతం అందచేయడంతో వారికి నోటీసులు జారీ చేసింది. పెత్తందారు జగన్, పెన్షన్ నిధులను మళ్ళించారంటూ జగన్‌పై కార్టూన్లు రూపొందించి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారంటూ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు లేళ్ల అప్పిరెడ్డి.

వైసీపీ ఫిర్యాదులపై స్పందించిన ఏపీ ఎన్నికల సంఘం.. టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడుకి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఇక.. అంతకుముందే.. వైసీపీ ఫిర్యాదుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. గత నెల 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ప్రసంగంపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దాంతో.. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. 48 గంటల్లోకి వివరణ ఇవ్వాలని గడువు విధించింది. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని హెచ్చరించింది. మొత్తంగా.. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇద్దరు సీనియర్లకు ఈసీ నోటీసులు ఇవ్వగా.. వారిని ఎలాంటి రియాక్షన్‌ వస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?