Vijayawada: విషాదాంతమైన తొమ్మిదో తరగతి బాలిక మిస్సింగ్ కేసు.. అత్యాచారామా.. ఆత్మహత్యా..!!

| Edited By: Srilakshmi C

Jul 24, 2023 | 11:53 AM

కృష్ణా జిల్లా పామర్రు మండలంలో బాలిక మిస్సింగ్ కేసు ఉదంతం విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం మిస్ అయినా బాలిక నిన్న పంట కాలువలో శవమై తేలింది. ప్రేమ పేరుతొ ట్రాప్ చేసి 9 వ తరగతి..

Vijayawada: విషాదాంతమైన తొమ్మిదో తరగతి బాలిక మిస్సింగ్ కేసు.. అత్యాచారామా.. ఆత్మహత్యా..!!
Vijayawada Crime
Follow us on

విజయవాడ, జులై 24: కృష్ణా జిల్లా పామర్రు మండలంలో బాలిక మిస్సింగ్ కేసు ఉదంతం విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం మిస్ అయినా బాలిక నిన్న పంట కాలువలో శవమై తేలింది. ప్రేమ పేరుతొ ట్రాప్ చేసి 9 వ తరగతి చదువుతున్న బాలికను లాడ్జ్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేసారు ఇద్దరు అన్నదమ్ములు. గత నాలుగు రోజులుగా బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, మొవ్వ మండలం మంత్రిపాలెం కాలువలో బాలిక మృతదేహాన్ని నిన్న సాయంతం పోలీసులు గుర్తించారు. బాలిక తల్లి వాణి 20 వ తేదీ మిస్సింగ్ కేస్ నమోదు చేసింది.

ఫిర్యాదు చేసిన వెంటనే 12 బృందాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానితుడు లోకేష్ ను అతని బంధువైన నరేంద్ర బాలికను ఉయ్యూరు లోని ఓ లాడ్జి కు తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేసినట్లు గుర్తించారు. అదే రోజు బాలికను ఊరు దగ్గర్లో దింపేసినట్లు విచారంలో నిందితులు చెప్తున్నారు. మొత్తం 19 మందిని ఇప్పటి వరకు విచారించి నిందితులు లోకేష్, నరేంద్ర లపై 376(B),376(VA),342, ఐపీసీ సెక్షన్, ఫోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు.

కానీ ఇప్పటికే బాలిక డెత్ మిస్టరీ గానే వుంది. హత్య, ఆత్మహత్య అనేది తేలాల్సి ఉంది. ఇద్దరు ట్రాప్ చేసి చేసిందా లేక గ్యాంగ్ రేప్ ఆ అనేది పోలీసులు నిర్దారించాల్సి ఉంది. ప్రాధమికంగా అత్యాచార అవమానాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకొని ఉంటుందని నిర్దారించారు పోలీసులు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితేగానీ వాస్తవం తెలియరాదని పోలీసులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.